మమ్మల్ని పోలీసు శాఖలోని కొనసాగించండి
డీజీపీకి మహిళా పోలీసుల సభ్యుల బృందం వినతి
(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ క్రైమ్ బ్యూరో)
ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ ను మహిళా పోలీసుల సభ్యుల బృందం కలిసింది. ఈ మేరకు వారు డిజిపి కి ఓ వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రం లోని సారాంశం ఇలా ఉంది..తమను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలోనే కొనసాగించాలని, కొంత మంది అవగాహన లోపంతో అనాలోచితంగా చేసిన దుష్పచారం వల్ల 15000 మంది మహిళా పోలీసుల ఉద్యోగాలు ఊగిసలాడుతున్నాయి.. ఎవరో కొందరి స్వార్థపూరిత చర్యలకు అందరినీ బాధ్యులని చేయవద్దని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ..మహిళా పోలీసులు పోలీసు శాఖలోనే కొనసాగుతారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీఓ నెంబర్ 59 ను ఉపసంహరించుకోవడం జరగలేదు, దీనిపై ప్రభుత్వం మరింత పటిష్టమైన, స్పష్టమైన, సమగ్రంవంతమైన పరిపూర్ణతతో కూడిన విషయాలతో మహిళా పోలీసు వ్యస్థతో ముందుకు వస్తుందని, ప్రస్తుతం ప్రజలకు వారు అందింస్తున్న సేవలను మరింత అంకిత భావం తో ముందుకు వెళ్లాలని మహిళా పోలీసుల బృందం సభ్యులకు డిజిపి స్పష్టం చేయడం జరిగింది.
Home
Unlabelled
మమ్మల్ని పోలీసు శాఖలోని కొనసాగించండి,,,,, డీజీపీకి మహిళా పోలీసుల సభ్యుల బృందం వినతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: