అధిక వర్షాలతో నీటా మునిగిన పంట పొలాలు

పంట  నష్టంపై అధికార్ల అంచనా


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు, శీతానాగులవరం,తుమ్మలచెరువు గ్రామాల్లో అధిక వర్షాల వల్ల పంట పొలాలు నీట మునగడం జరిగింది. ఈ విపత్తును పర్యవేక్షించేందుకు మండల వ్యవసాయ అధికారి ఆర్.చంద్రశేఖర రావు గారు తర్లుపాడు, శీతానాగులవరం గ్రామ పొలాలను సందర్శించడం జరిగింది.


ఈ సందర్భంగా రైతులు పప్పు శనగ, వినుము, మిర్చి పొలాలు దాదాపు 300( మూడు వందల ) ఎకరాలు, అలాగే మినుము, మిర్చి పొలాలు నీట మునిగాయని చెప్పడం జరిగింది. పప్పు శనగ 6-8 రోజుల దశలో ఉందని, అలాగే మినుము పంట 10-14 రోజుల దశలో మిర్చి పంట 40-65 రోజుల దశలో ఉందని గమనించడం జరిగింది.


దీనిలో భాగంగా వ్యవసాయ అధికారి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేయడం జరిగినది. ఈ సందర్శన కి వ్యవసాయ అధికారి గారితో పాటు     తర్లుపాడు, శీతానాగులవరం గ్రామ రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు   డి. గోవింద్ భాష, పూర్ణ శంకర్, పొలాలను సందర్శించడం జరిగింది.



,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: