దేవుడీ..ప్రజల ఆశీస్సులు  కావాలి

ఆ రెండు ఉన్నంతకాలం ఎవరూ అడ్డుకోలేరు

చంద్రబాబే వాతావరణాన్ని రెచ్చగొట్టారు

తనలోని ప్రస్టేషన్ వల్లే ఇద్దంతా చేశారు

మా చిన్నాన్న..అమ్మ,..చెల్లి గురించి చంద్రబాబుయే ప్రస్తావించారు

అందుకే మా వాళ్లు స్పందించారు

చంద్రబాబు చెబుతున్నట్లుగా మా వాళ్లు అనలేదు

ఆ సమయంలో సభలో నేను లేను

కానీ నేనొచ్చే సరికి ఆయన ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు

చంద్రబాబుయే మా కుటుంబంలో చిచ్చుపెడుతున్నారు

ఆయనకు ఎపుడూ ప్రజా అజెండా పట్టదు

ప్రతి దాంట్లో రాజకీయ పొందాలని చూస్తారు

శాసనసభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటిికల్ బ్యూరో)

దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు రాజకీయాలలో అవసరమని, ఆ రెండు ఉన్నంత కాలం ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేవుడీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం రాజకీయాలలో రాణించగలుగుతామన్నారు. చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారని, అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు అంటున్నట్లుగా తమ పార్టీ వాళ్లు సభలో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో రెచ్చగొట్టే వాతావరణాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ వాళ్లు స్పందించాల్సి వచ్చిందన్నారు. సభలో తమ చిన్నాన్న, తల్లి, చెల్లి గురించి ప్రస్తావించింది చంద్రబాబు నాయుడేనన్నారు. ఆయన మా కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా అజెండా చంద్రబాబుకు పట్టదని, ప్రతి దాంట్లో ఆయన రాజకీయ లబ్ధికోరుకొంటారని పేర్కొన్నారు. శుక్రవారంనాడు శాసనసభలో వ్యవసాయంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అపద్దాన్ని పదే పదే చెప్పి చంద్రబాబు వాటిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల ప్రజలు , రైతులు ఎంతో నష్టపోయారని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సిన చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇతర అంశాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ...‘‘రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి, పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే, ప్రతి అంశంలోనూ నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూక్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబు వెళ్లిపోతారు, ఆయన మాట్లాడిన తీరు, చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ల ఎదుటే కనబడ్డాయి, అది జరిగేటప్పుడు నేను సభలో లేను :


నేను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్షచేశాను, సభకు వచ్చిన తర్వాత జరిగిన పరాణామాలేంటో తెలుసుకున్నాను, నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు, ఆయన ఫ్రస్టేషన్‌లో ఉన్నారు, చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యం, చంద్రబాబుమీద తాము వ్యతిరేకంగా ఉన్నామని తీర్పిచ్చారు, ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారు,మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది, మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది, కౌన్సిల్‌ ఛైర్మన్‌గా వైసీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు రాబోతున్నాడు, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు, ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదు, సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారు,

దాన్ని ఖండిస్తూ అధికార పక్షంనుంచి కూడా కొంతమంది మాట్లాడతారు, తానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారు, సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షంనుంచి మాట్లాడతారు, చంద్రబాబు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదు, మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా హత్య అయితేనేమి, మాధవరెడ్డి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారు, చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈమాటలన్నారు,

ఎక్కడా కూడా కుటుంబ సభ్యులగురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదు, కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూడా కూడామాట్లాడలేదు, మా చిన్నాన్న గురించి, మా అమ్మగురించి, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు, అధికారపక్షంనుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు, సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది, మా వాళ్లు అందరూ కూడా ఇదే చెప్పారు, వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారు, ఇవన్నీ మన కళ్లముందే చూశాం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు, నేను అయినా, ఎవరైనా అంతా నిమిత్త మాత్రులమే, దేవుడు ఎంతకాలం అయితే ఆశీర్వదిస్తాడో.. అంతకాలం మనం పనిచేయగలుగుతాం, దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు రాజకీయాల్లో ముఖ్యం, ఎంతకాలం మనం మంచి చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ఆ మంచి జరిగిన కాలం ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆ రెండూ ఉన్నంతకాలం.. ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు, ఇది వాస్తవం, కాని ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా లేకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాటి పత్రిక నాకు లేకపోవచ్చు. టీవీ–5 లాంటి సంస్థ నాకు లేకపోవచ్చు, ఇంత మంది సంఖ్య నాకు లేకపోవచ్చు, అబద్ధాన్ని నిజం చేసేందుకు, చెప్పిందే చెప్పి దాన్ని నిజంచేయడానికి ఈ మేధావులు ప్రయత్నిస్తాారు. గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలు, వీళ్లు ఏ అబద్ధం చెప్పినా దాన్ని నిజం చేయడానికి రాతలు రాస్తారు, స్క్రోలింగ్స్‌ వేస్తారు, టీవీల్లో చూపిస్తారు, మీడియాలో వీరి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఏమైనా చేస్తారు, కాని నిజం మాత్రం దాచలేరు, ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అన్నదాన్ని మార్చలేరు, ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఏదో జరిగిపోయిందని చూపించవచ్చు, ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా వాళ్లే చెప్పేయొచ్చు, ఆయనే అన్ని మాటలు మాట్లాడతాడు, ఆయనే డ్రామా చేస్తాడు:

ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా... మాట్లాడినట్టు చూపించవచ్చు, ఏమైనా జరగొచ్చు, కాని చిట్టచివరిగా దేవుడు ఇవన్నీ చూస్తాడు, ప్రజలు చూస్తూ ఉన్నారు,

దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలాంటి టీవీ–5లు ఎంత చంద్రబాబుగారిని మోసినా అంతిమంగా మంచే విజయం సాధిస్తుంది.  చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, మా చిన్నాన్నగురించి చంద్రబాబు మాట్లాడతాడు, వివేకా నాకు చిన్నాన్న, చంద్రబాబుకు కాదు, సొంత మా నాన్న తమ్ముడు, ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారు, అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకు, ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా, మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటాం, వివేకా గారి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది,

అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాం, మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా అప్పుడు  ప్రతిపక్షంలో ఉన్నారు, మా చిన్నాన్నను ఓడించడం కోసం చేసిన అక్రమాలు అన్నీఇన్నీకావు, కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీలు, జడ్పీసీలు మాకు ఎక్కువ ఉన్నారు, మేం ఎక్కడ గెలిచినా కూడా మా పార్టీ నుంచి చినాన్నన్నను మాపార్టీ నుంచి పోటీపెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను డబ్బు ఇచ్చి ప్రలోభాలు పెట్టి, స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టి , పోలీసులను పెట్టి, కుయుక్తులను పన్ని ఇలా రకరకాలుగా అక్రమాలు చేసి మా చిన్నాన్నను ఓడించారు, అంతటి దారుణంగా ప్రవర్తించారు, మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే.. అది వాళ్లే చేసి ఉండాలి:

అటువంటి దాన్ని ట్విస్ట్‌చేసి, వక్రీకరించి ఏదేదో చేస్తున్నారు, చివరకు మాకుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది,  అలాంటి విషయాలను కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్‌చేసి, రాజకీయంగా మాట్లాడతారు, ఏవేవో చెప్పే కార్యక్రమాలుచేస్తారు, ఇది చాలా దురదృష్టకరం, అయినా పైనా దేవుడు ఉన్నాడు ఆయనే చూస్తాడు.’ ’  అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: