శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం
చరిత్ర హీనులుగా మిగలొద్దు
నారా చంద్రబాబు నాయుడు
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోంది అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోదాలు కల్పిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసులను అడ్దుపెట్టుకుని ఉక్కుపాదం మోపుతోంది. కోర్టు అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య. పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదు. జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు అని నిన్న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారు. వారికి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? సీఎంకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అనగదొక్కుతున్నారు.ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తు ని అంధకారంలో కి నెట్టి క్షమిoచరాని తప్పు చేశారు. 5 కోట్ల మంది ఆకాంక్షలనుగుణంగా రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు. అని ఆయన హితవు పలికారు.
Post A Comment:
0 comments: