మెడికల్ మాఫియా..!
వైద్యం పేరుతో అన్ని దోపిడీ..!!
మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు...?
రిఫర్ చెయ్యి డబ్బు పట్టు అనే ధోరణి లో వైద్యులు
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోందా...? వైద్యం వెరీ కాస్ట్లిగా మారుతోందా అంటే అవుననే చెప్పవచ్చు. వైద్యుల తీరుపైనా మెడికల్ వ్యాపారుల ధోరణీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాధి నిర్ధారణ టెస్టుల పేరుతో కొంత మంది ఎం.బీ.బీఎస్, ఆర్ఎంపీ వైద్యుల దోపిడీకి అదుపే లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి.
డాక్టర్లు చెప్పడం తో అన్ని రకాల టెస్టులకు వేలకు,వేలు పెట్టి టెస్టులు చేయిస్తున్న సామాన్య ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ రకాల టెస్ట్ లకు ప్రభుత్వం తరుపు నుంచి నీర్ణిత ధర నిర్ణయించకపోవడంతో టెస్ట్ ల పేరుతో ల్యాబ్ లు ఆసుపత్రలు విచ్చల విడిగా దోచుకొంటున్నారు. అమరావతి పరిధిలో విచ్చల విడిగా ,యథేచ్ఛగా అధిక ధరల విక్రయాలకు జనరిక్, ఇతర మందుల విక్రయాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.
అమ్మకోడాని మందులు అంటే డాక్టర్లు రాసిచ్చిన చిట్టీ లేకుండా (అబ్షాన్ మందులు మెడికల్ షాప్ యజమానులు విక్రయిస్తున్న ఉద్దంతాలు అనేకంగా ఉన్నాయి. జిల్లా అధికారుల తనిఖీలు ఎక్కడా, ప్రతి ప్రవేట్ ఆసుపత్రుల్లో అనుమతులు లేకుండా మందుల విక్రయాలు సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థికి కారణం మామూళ్ల మత్తే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
Post A Comment:
0 comments: