ఈ క్రాఫ్ నమోదు చేయించుకుంటేనే...

ప్రభుత్వ రాయితీలు

మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు


(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా  తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు రైతు భరోసా కేంద్రం నందు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి  మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు  మాట్లాడుతూ కంది పంటలో విత్తనం నుండి విక్రయం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అలాగే కంది పంటలో సమగ్ర సస్యరక్షణ (IIM) మరియు సమగ్ర పంట యజమాన్యం (ICM) పద్ధతులపై రైతులకు తగు సూచనలు మరియు సలహాలు తెలియజేశారు. పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా


ఈ క్రాఫ్ నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ, పంటల బీమా, పంటకు గిట్టుబాటు ధర కు అర్హులు అవుతారని తెలిపారు. పొలం లో ఉన్నటువంటి కంది పంటను పరిశీలించి రైతులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలచెరువు గ్రామా వ్యవసాయ సహాయకులు టి.భూపాల్, తర్లుపాడు మండలం లోని రైతు భరోసా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: