రైతు పాలిట ఆపద్బాంధవుడు వైయస్ జగన్
గడివేముల మండల వైఎస్సార్సీపీ సమావేశంలో నేతలుు
(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం లోని గడివేముల మండలం లోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గడివేముల మండల జెడ్ పి టి సి .ఆర్ .బి .చంద్రశేఖర్ రెడ్డినీ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గడివేముల మండల వై ఎస్ ఆర్ సి పి, నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గా గడివేముల మండల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,వైయస్సార్సీపి అధినాయకులు జగన్ మోహన్ రెడ్డి రైతు పాలిట ఆపద్బాంధవుడు అని ,రైతుల ఆనందం కోసం ఒకే రోజు మూడు పథకాలు ప్రారంభించి రైతుల ఇళ్లల్లో దీపావళి పండుగ రాకముందే రైతుల్లో ఇళ్లలో దీపావళి కాంతులు విరజిమ్మేలా చేసి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు అని, అదేవిధంగా గడివేముల మండలంలో గత టిడిపి ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు టిడిపి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండానే ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకుందని, అనంతరం అధికారంలోకి వచ్చిన మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి
పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నింటినీ చెల్లించడం జరిగిందని, ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలతో, అభివృద్ధి పథకాలతో ప్రజల వద్దకు దూసుకుపోతున్నాడు అని, గడివేముల మండలం లోని పొదుపు మహిళలకు గాను పది వేల రూపాయల వడ్డీ ని పార్టీలకు అతీతంగా అందజేయాలని అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అధికారులకు సర్పంచులకు ఆదేశాలు ఇచ్చారని, ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం మండలంలోని ప్రతి సర్పంచులు సంతకాలు చేసి అధికారులకు అందించామని, టిడిపి నాయకులు ప్రతి కార్యక్రమంలో దొంగలే ..దొంగ ...దొంగ ....అని అరుస్తూ నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారని దీనిని ప్రజలు ఎవరూ నమ్మరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయశాఖ సొసైటీ అధ్యక్షులు బిలకలగూడూరు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ ,తిరుపతి రెడ్డి, చిందుకూరు మాజీ సర్పంచ్ వెంకట కృష్ణారెడ్డి, గడిగరేవుల రామ్మోహన్ రెడ్డి, కొర్ర పోలూరు సుబ్బారెడ్డి, వివిధ మండలాల వైసిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: