గడివేముల లో బంద్ ప్రశాంతం...
స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు
గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన గడివేముల ఎస్ఐ
(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500 రైతుసంఘాలు భారత్ బంద్ పిలుపు నిచ్చిన సందర్భంగా గడివేముల మండలంలో సిపిఎం, సి ఐ టి యు, ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండలం సిపిఎం నాయకుడు ఎల్ల సుబ్బయ్య మాట్లాడుతూ రైతులు గత 9 నెలల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దీక్షలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని తెలిపారు. అదానీ అంబానీ, కార్పొరేట్ సంస్థల ఆదాయం పెంచడానికి వారి పన్నులు తగ్గించి, వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగిందని, అదే పేద ప్రజల పై డీజలు, పెట్రోలు, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల పై అధిక ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది అని తెలిపారు. ఇప్పటికైనా నా ప్రభుత్వం కళ్లు తెరచి రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను రద్దు చేయాలని అని, ధరలను సామాన్యుడికి
బంద్ సందర్భంగా రహదారులపైైైై నిలిచిపోయిన వాహనాలు
అందుబాటులోకి తీసుకురావాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు గోకారి సా, ఆటో యూనియన్ నాయకులు ఖలీల్, ధనుంజయుడు, మాచర్ల, సామేలు, హమాలీ కార్మికులు చిన్నన్న, సిపిఎం , సి ఐ టి యు కార్మికులు, పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని షాపు యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి రైతులకు మద్దతుగా నిలిచారు.
బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ ఎం. శ్రీధర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారుు
స్వచ్ఛందంగా దుకాణాలుుు బంద్ చేసి అందుకు మద్దతు తెలిపిన వ్యాపారులు
Post A Comment:
0 comments: