ఓటు అడగం తెలుసు,,,,
సమస్యలు మాత్రం పట్టవా..
ప్రజాప్రతినిధులు... అధికారుల తీరుపై-సుందరయ్య కాలనీ వాసుల ఆగ్రహం
(జానో జాగో వెబ్ న్యూస్_ సినిమా బ్యూరో)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారులో గల సుందరయ్య కాలనిలో ప్రజల మౌళిక వసతులు, ముఖ్యంగా దాహార్తిని తీర్చడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్ల సమయంలో గుర్తుకు వచ్చే ఓట్ల కోసం తప్ప ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమైందని ముఖ్యంగా వారి తాగునీటి సమస్యలు తీర్చడంలో మాత్రం ప్రజలు గుర్తుకు రావడం లేదు. పేరు ఏమో సుందరయ్య కాలనీ వసతులలో మాత్రం వెనుకబడి పోయారు.
బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.క్రిష్ణారావు
ఎటు చూసిన పారిశుద్ధ్యం, సరైన రోడ్లు కాలువలు వీధి దీపాలు లేకుండా వెలవెలబోతోంది ఎలక్షన్లు వస్తే మాత్రం నాయకులు వచ్చి అవి చేస్తాం ఇది చేస్తాం అంటూ నానా హంగామా చేసి వారి అవసరం తీరాక ఎవరు ఇటువైపు తొంగి చూడడం లేదు అంటూ కాలనీవాసులు వాపోయారు. BMS ప్రకాశం జిల్లా ఇంచార్జ్ P. V. కృష్ణారావుకు కాలనీవాసులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన వసతులు కల్పించే విధంగా చూడాలని కోరారు, శిధిలావస్థలో ఉన్న నీటి ట్యాంక్ లో నీరు నిల్వ ఉండడం లేదని ఇప్పటికైనా అధికారులు నాయకులు గమనించి త్రాగునీటి సమస్య తీర్చే విధంగా చూడాలని రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: