నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
వివరాలతో సహా డిజిపికి ఫిర్యాదు చేశా
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్్
(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)
లేపేస్తాం, చంపేస్తాం, బాంబు పెడతాం అంటూ గోషామహల్ నియోజకవర్గం తనకు బెదిరింపు కాల్స్ రావడంతో ఫోన్ నెంబర్లతో సహా పూర్తి వివరాలు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
గతంలోంలో ఇదే మాదిరిగా దేశ విదేశాల నుండి బెదిరింపు కాల్స్ రావడంతో డిజిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పిన డిజిపి ఇవ్వడం లేదన్నారు. తాను బీజేపీ ఫ్లోర్ లీడర్ఐన డిజిపి మాత్రం లైసెన్స్ ఇవ్వడం లేదన్నారు, దేశద్రోహి అక్బరుద్దీన్ పై ఎన్ని కేసులు ఉన్నా డిజిపి గన్ లైసెన్స్ ఇచ్చారని రాజా సింగ్ విమర్శించారు.
Post A Comment:
0 comments: