2008 డిఎస్సి లో నష్టపోయిన వారికి
జీతాలు మంజూరుచేయాలి…..
ఎస్ టి యు డిమాండ్్
(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2008 డిఎస్సిలో నష్టపోయిన వారికి మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ వారికి వివిధ పాఠశాలలకు రెండు నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చివున్నారు. వారికి ఇంతవరకు జీతభత్యాలు ఎలా చెల్లించాలో విధి విధానాలు తెలియ చేయకపోవడంపట్ల ఎస్ టి యు ఆవేదన వ్యక్తం చేస్తూ, వివిధ సమస్యల పట్ల ప్రకాశం జిల్లా శాఖ, జిల్లావిద్యాధికారి బి. విజయభాస్కర్ గారిని మర్యాద పూర్వకంగా కలసి సమస్యలను నివేదించడం జరిగింది.
గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ రోస్టర్ పాయింట్ తో తయారుచేయాలని, వివిధ క్యాడర్లలో ఖాలీగ వున్న పోస్ట్ లను పదోన్నతుల ద్వారా భర్తిచేయాలని, ప్రధానోపాధ్యాయులకు వివిధ యాప్ ల బారినుండి తప్పించాలని, పిఎఫ్,ఎపిజిఎల్ఐ క్లోజర్స్, లోన్స్ వెంటనే మంజూరు చేయాలని, మెడికల్ బిల్స్ సత్వరమే పరిష్కరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ లోవున్న డిఎ లను మంజూరు చేసి పి ఆర్ సి ని ప్రకటించాలని , తరగతి గదులకు భవన వసతులు లేని పాఠశాలలకు భవన వసతులు కల్పించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఖాలీలుగా వున్న ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని, బదిలీలు చేపట్టాలని, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా కోట్ల రూపాయాలతో ముస్తాబైన పాఠశాలలకు వాచ్ మెన్ పోస్ట్ మంజూరు చేసి వాటిని పరిరక్షించాలని, సర్వీసు రెగ్యులరైజేషన్ మేళాను నిర్వహించాలని, విపి గ్రేడ్, గ్రేడ్ II ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని, జిల్లాలో ఖాలీగా ఉన్న ఎమ్.ఇ.ఓ. పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ఎమ్ ఆర్ సి కి ఉపాధ్యాయుల సర్వీసు విషయాలను పర్యవేక్షించుటకు గుమస్తాను కేటాయించాలని, తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ టీ యు ప్రకాశం జిల్లా నాయకులు చల్లా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్ కె.ఎర్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కె. ప్రవీణ్ కుమార్ కోరడమైనది.
ముఖ్యంగా మన పాఠశాలలలో పనిచేయుచున్న ఆయాలకు నెలకు ఆరువేలు చొప్పున మన జిల్లాకు ఐదు కోట్ల రూపాయాలు మంజూరు చేయడం పట్ల ఎస్ టీ యు హర్షం వ్యక్త పరచడమైనది. ఈ డబ్బులను వారివారి వ్యక్తిగత బ్యాంకు ఖాతలలో జమా చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: