పార్లమెంటు నియోజకవర్గానికో...
నైపుణ్యాభివృద్ధి,,,ఐటీఐ కాలేజీలు
పాఠ్యాంశాలను అప్గ్రేడ్ చేయండి
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ పై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సమీక్ష
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
పార్లమెంటు నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి,,,ఐటీఐ కాలేజీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికార్లకు ముఖఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సోమవారంనాడు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ పై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నాం, విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్యూనివర్శిటీని, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్యూనివర్శిటీలు రూపొందిస్తాయి, కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుంది. గ్రామాలలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంద్వారా వర్క్ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేస్తున్నాం, పార్లమెంటు నియోజక వర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు, వర్క్ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుంది, దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయన్నారు. విశాఖపట్నంలో హై ఎండ్స్కిల్స్ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలని, తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలని, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతో పాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్కాలేజీల తరగతిగదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలి. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు.
పాఠ్యాంశాలను అప్గ్రేడ్ చేయాలి
ప్రతి ఐటీ ఐలోనూ నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. దీనివల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. టెన్త్లోపు డ్రాప్ అవుట్ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలనిి, కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందిన వారి డేటాను పంపించాలని, 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డ్రింకింగ్వాటర్ ప్లాంట్లు, మోటార్లు, సోలార్ యూనిట్లు.. ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలా వరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్యంకోసం వినియోగిస్తున్న పరికరాలను నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉంది, నైపుణ్యంలేని మానవవనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడంలేదు, నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదని, ఇలా నిత్యజీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవనరులను అభివృద్ధి చేయాల్సి ఉంది : అధికారులకు సీఎం నిర్దేశం.ఇంగ్లిషు భాషలో కూడా పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహణకోసం నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశం
నియోజకవర్గానికి ఒక ఐటీఐ
నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలి, దీంతో నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుంది, ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనకూడా దృష్టిపెట్టండి, ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికెషన్ చేయించాలి, ప్రతి కాలేజీ, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించే దిశగా అడుగు ముందుకేయాలి, ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్ స్టాఫ్ను పెట్టాలి సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ ఇంజినీరింగ్కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్ సిబ్బందిపై పరిశీలన చేయాలి, ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీచేశాం. అని ఆయన పేర్్కొన్నారు. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించి, శిక్షణ పొందిన వారికి అప్రంటిషిప్ వచ్చేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిపుణుల చేత బోధన ఇప్పించేటప్పుడు దాన్ని డిజిటల్ పద్ధతిలో పొందుపర్చాలని, మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చు అని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్య, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కె అజయ్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎన్ బంగార్రాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: