ఆదాయ రాబడులపై,,,
దృష్టి పెట్టండి
అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపండి
అధికార్లకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశం
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని, ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలని, జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలని, రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్నారు. ఈ సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలన్న సీఎం, కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని, దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశించారు.
వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం
మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలి, సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు చక్కగా సేవలు అందుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి?:ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?! అని అధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికార్లు తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్చేశామని వివరణ ఇచ్చారు.
ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడంలేదు అని అధికార్లను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పటినుంచి, ఎన్నిరోజులనుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి?:క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా?లేవా?ఎందుకు చూడ్డంలేదు? క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకొని, అవినీతిపై ఎవరికి కాల్చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్నంబర్ ఉంచండి:అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నంబర్ఉండాలి. కాల్సెంటర్కు వచ్చే కాల్స్మీద అధికారులు దృష్టిపెట్టాలని, కాల్సెంటర్మీద అధికారులు ఓనర్షిప్ తీసుకోండి, అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్ఓపీలను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశం. కేవలం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాదు, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. సాఫ్ట్వేర్మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామన్న ఆర్థికశాఖ అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని వారు పేర్కొన్నారు. మీ–సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. కనీసంగా వారం – పదిరోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలని , ఆదాయవనరులు, పరిస్థితులపై సమీక్షచేయాలని సీఎం సూచించారు.
వివిధ రంగాల వారీగా సమీక్ష చేయాలని సీఎం ఆదేశం.ప్రతి సమావేశంలో ఒక రంగంపై సమీక్షచేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరివారంలో పరిశీలన చేయాలన్న సూచించిన సీఎం. మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులకు ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపండని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నాం, దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నాం, ఇలాంటి వ్యవహారాలపై ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: