ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ కు,,, 

శుభాకాంక్షలు తెలిపిన ఎం.పి.జె అధ్యక్షులు ఖాసిం బృందం


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

ఖమ్మం జిల్లాకు నూతన కలెక్టరుగా వచ్చిన పి.వి. గౌతమ్ గారిని జిల్లా ఎం.పి.జె నాయకులతో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపిన అధ్యక్షులు ఎస్.కే.ఖాసిం.  ఈ సందర్భం గా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు కలెక్టరు గారిని పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు.  కలెక్టరు గౌతం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ  చేసిన కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు.  జైలర్ గారి సహకారంతో, పేద ఖైదీలను అపరాధ రుసుము చెల్లించి విడుదల చేయించడం, కరోనా మహమ్మారి దెబ్బకు చితికి పోయిన ప్రైవేట్ టీచర్లకు ఆర్ధిక సహాయం అందించడం, శివారు ప్రాంతాలలో వున్న ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం, తదితర అంశాలను ఆసక్తిగా విన్న కలెక్టరు గారు ఎం.పి.జె సభ్యులకు  అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎం.పి.జె సేవలు ఇంకా విస్తరించాలని, మరెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఎం.పి.జె జిల్లా కార్యదర్శి  బి. సతీష్ చౌదరి, కోశాధికారి హకీం, షర్ఫుద్దీన్, గౌస్, జాని తదితర నాయకులు పాల్గొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: