తలసీమియా బాధితురాలికి రక్తదానం
ఉదారత చాటుకొన్న ముస్లిం నగారా
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన.రక్త దానం చేద్దాం-ప్రసవ మరణాలను నివారిద్దాం అనే కార్యక్రమము హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో జరిగింది. గుడిబండ మండలం కేకాతి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మ ప్రసవానికి హిందూపురం వచ్చి బీ నెగిటివ్ రక్తం దొరకక ఇబ్బంది పడుతుంటే ఈ విషయం టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం వ్యవస్థాపకులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ దృష్టికి వస్తే రక్తదాత అబ్దుల్ వాజిద్ కార్పెంటర్ ను సంప్రదించి రక్తదానం చేయించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో 4.5కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలోమూడు కోట్ల యాభై లక్షల మంది తలసీమియా మహమ్మారి తో బాధ పడుతున్నారని
ప్రతి 20రోజులకు రక్తం దాతల ద్వారా దొరకక పోతే మరణమే శరణ్యమని ప్రతి 18సంవత్సరాలనుండి 55సంవత్సరాల ఆరోగ్యవంతులు బ్లడ్ బ్యాంక్ రక్త నిధి కి వెళ్లి స్వచ్ఛoదంగా రక్తదానం చేసి కోట్లాది తలసీమియా బాధితుల కు ప్రాణదానం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు స్వచ్చందంగా రక్తనిధి కి వచ్చి రక్తదానం చేసిన అబ్దుల్ వాజిద్ నుఅభినందించి ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో .మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా గారు.టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్.అలీ భాయ్.బిలాల్ అమీన్.జబీ. టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం సభ్యులుతదితరులు పాల్గొని రక్తదాతకు అభినందించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: