ఆత్మ పరిశుద్దత...చెడును త్యాజించడం
ఇదే ఈద్ సందేశం
ఈద్ యొక్క నిజమైన ఆధ్యాత్మిక ఆత్మ ఏమిటంటే మనిషి తన నైజం లోని అపరిశుద్ధతను బలి చేయాలి ఈద్-ఉల్-ఫితర్ సందర్భంలో మనిషి నైజం ను పరిశుద్ధ పరచ డానికి ఏ విధంగా శిక్షణ ఇవ్వబడిందో అదేవిధంగా ఈదుల్ అద్ హా సందర్భంలోనూ నైజంలోని మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవాలని డిమాండ్ చేయబడుతోంది. ముస్లిములు: జంతువులను, ఒంటెలను, మేకపోతులను, ఏ విధంగా కుర్బానీ ఇస్తున్నారో అదేవిధంగా తమలో ఉన్న చెడులను అంటే కోపం, అజ్ఞానం,పిరికితనం, ఏమరుపాటు, గర్వం మోసం, అసహ్యత, కోరికలకు బానిస కావడం వంటి వాటినన్నింటిని బలి చేయడం; అంటే వాటిని మానుకోవడం.అప్పుడే ఇబ్రహీం అలై జీవిత చరిత్రకు సార్థకత లభిస్తుంది. ముస్లిములు సత్య ధర్మ సందేశ హరులుగా మన గలుగుతారు.
అల్లామ ఇక్బాల్ ఇలా అంటున్నారు:
యే నీమ్ షబ్
ఈ మసక మసక రాత్రులలో
యే మురాఖబే
చేసే నీ దైవారాధనలు
యే సుజూద్
నీసాష్టాంగ పడడాలు
తేరీ ఖుదీకే
నిన్నే
నిగేహ్ బాన్ నహీతో
ప్రక్షాళనం చేయకపోతే
కుఛ్ భీ నహీ
అన్నీ వృధానే కదా
రండి ఈ పవిత్ర ఈద్ సందర్భంగా మనం వాగ్దానం చేద్దాం నిజంగా మనం సత్య ధర్మానికి, ముహమ్మద్ సల్లం గారి ధర్మానికి నిజమైన వారసులుగా నిలుద్దాం. నేను ఈ సందర్భంగా ఈద్ సందేశంతో పాటు ప్రపంచ ముస్లింలకు, ప్రత్యేకించి భారతీయ ముస్లింలకు మరియు దేశ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రచయిత -- డాక్టర్ ముహమ్మద్ ఖుతుబుద్దీన్
అమెరికన్ మనస్తత్వవేత్త, సోషల్ ఆక్టివిస్ట్
రచన అనువాదం-మొహమ్మద్ అబ్దుల్ రషీద్
హైదరాబాద్-సెల్ నెం-98485-16163
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: