మత రాజకీయాలు కాదు..
హామీలు నెరవేర్చండి
వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
ఏపీలో బీజేపీ మతాల పేరుతో అతి రాజకీయం చేస్తుందని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూల, ఏ చిన్న సంఘటన జరిగినా దానిని ప్రభుత్వానికి అంటగట్టి బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.. అన్ని మతాలు, కులాలను సమానంగా చూస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. తమ ప్రభుత్వానికి ఏ మతం తక్కువకాదు అన్ని మతాలు సమానం అని ఏలూరి తెలిపారు.
గోవుల అక్రమ రవాణా జరగకపోయినా జరిగినట్టు మాట్లాడి ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించడం దారుణమన్నారు. అంతర్వేది రధం దగ్దం కేసును సిబిఐకి ఇస్తే ఇంతవరకూ దర్యాప్తు చేపట్టలేదు.. ఎందుకు దర్యాప్తు చెయ్యలేదో సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు.. ఇక ముఖ్యమంత్రిని ఒక మతానికి పరిమితం చేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఏలూరి.. మతరాజకీయాలు మాని.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం పునరావాస ప్యాకేజి అలాగే విభజన హామీలపై బీజేపీ నాయకులు పోరాటం చెయ్యాలని డాక్టర్ ఏలూరి సూచించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: