తర్లుపాడు లో ఘనంగా,,,
గురుపౌర్ణమి వేడుకలు
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు లోని స్థానిక షిరిడి సాయి బాబా మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వి హెచ్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వెన్నా.ఇందిరా, సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ఎమ్మార్వో నాగ మల్లికార్జున రావు, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి రామసుబ్బారెడ్డి దంపతులు మరియు గ్రామాల్లోని మహిళా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆ అభిషేకం అన్నప్రసాద వితరణజరిగింది. ఈ కార్యక్రమంలో మాదాల కోటేశ్వరరావు, మాదాల శంకరం, కుందూరు శ్రీకాంత్ రెడ్డి, భవనం రామకృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, బుర్రి. అచ్చమ్మ, మహిళలు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: