మీ హయాంలో విస్మరించి...ఇపుడు ప్రశ్నించడమా
టీడీపీ నేతలపై డాక్టర్ ఏలూరి ఫైర్
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
తమ హమాంలో వెలిగొండ ప్రాజెక్టు విస్మరించి ఇపుడు వైసీపీ ప్రభుత్వం వాటిని చేపడుతుంటే ప్రశ్నిలు గుప్పించడం సిగ్గుచేటని టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ...టీడీపీ ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయకుంటే ప్రశ్నించని టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ హయాంలో ప్రాజెక్టు పూర్తవుతుంటే ప్రజల దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. వారానికోసారి ప్రాజెక్టు వద్దకు వెళ్లడం.. అక్కడేదో పొడిచేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. వెలిగొండ విషయంలో రోజుకోరకంగా ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం సిగ్గుచేటు. అని ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: