ప్రజాధనంతో ఎన్నికల్లో లబ్ధికి యత్నాలు
కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విమర్శ
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
ప్రజాధనంతో అధికార టి.అర్.ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరొక వైపు హుజూరాబాద్ లో ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎటువంటి కోవిద్ నిబంధనలను పాటించకుండా ప్రచార హోరు జోరుగా సాగుతోందని ఆయన విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను కరోనా ముప్పుకు గురి చేస్తున్నారు. ఒక వైపు ప్రజలను మాస్క్ ధరించాలి, భౌతిక దూరము పాటించాలని చెపుతూ మరొక వైపు సి.ఎమ్, మంత్రులే పాటించక పోవడం దురదృష్టకరం. దళిత బంధు కార్యక్రమాన్ని ఉప ఎన్నికలు అయ్యే వరకు ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు జరిగే ఏ పనిని ఆపుమని కోరదు.. దళిత బంధు పూర్తిగా ఎన్నికల కోసమే తెస్తున్నారు. సి.ఎం హోదాలో ఉంటూ మేము సన్యాసులము కాదు. రాజకీయము ఎందుకు చేయకూడదని దిగజారుడు మాటలు మాట్లాడటం తగదు. కేసీఆర్ స్వయంగా ఎన్నికల కోసమే తెస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్, కోర్టు లు సుమోటోగా తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి. దళిత బంధు ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ దీన్ని పూర్తిగా రాష్ట్రమంతా అమలు చేయాలి. పైలెట్ ప్రాజెక్ట్ పేరుతో హుజూరాబాద్ లోనే ఎందుకు..? రాష్ట్రంలో దళిత బంధు మొత్తం 1200 కోట్లయితే కేవలము హూజూరాబాద్ లోనే 1500 నుండి 2000 కోట్లు ఖర్చు పెడతామని సి.ఎం అనడములో ఉద్దేశ్యమేమిటి?. ప్రగతి భవన్ కు హుజురాబాద్ ప్రతి గ్రామంనుండి ఇద్దరు, ప్రతి మునిసిపల్ వార్డు నుండి ఇద్దరు నాయకులను మొత్తము 412 మందిని పిలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటము ఎన్నికల కోసమేనా? వారితో కల్సి చేసిన భోజనం ఎన్నికల కోసమేనా? ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రతి నియోజక వర్గము
తన ఫోటోకు రెండు వైపుల బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఫొటోలు పెట్టుకున్నంత మాత్రాన దళిత బందు కాలేడు రెండో విడత గొర్రెల పంపిణీ కూడా మంత్రి శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ నియోజకవర్గములోని జమ్మికుంట లో నిన్న ప్రారంభించి ఆ నియోజక వర్గము లోని 500 లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేశారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఈ నెల నుంచి ఇస్తామని ప్రకటించారు. 30% పిట్మెంట్ ఇస్తున్నందుకు టి.ఎన్.జి.ఓ లు ప్రతి జిల్లాలో సి.ఎం కృతఙతా సభలు పెడతామని, అదీ కరీంనగర్ నగర్ నుండి మొదలు పెడదామనడము, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యులు కాబోయే ఎన్.జి.ఓ లు ఎంత నిష్పక్షపాతంగా ఉండబోతారో అనడానికి నిదర్శనం. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు జరిగే ఈ అధికార దుర్వినియోగానికి కళ్లెం వేయకుండా నిష్ఫక్షపాత ఎన్నికలు జరుపలేదు. అసెంబ్లీ, లొక్ సభ తో సహా ఏ స్థానానికైనా ఖాళీ ఏర్పడిన నాటి నుండే అధికార దుర్వినియోగం జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఈ అధికార దుర్వినియోగం, కరోనా నిబందనలను ఉల్లఘింస్తూ చేసే ప్రచారాలను అరికట్టలేక పోతే వెంటనే ఎన్నికలను ప్రకటించాలి. అధికార దుర్వినియోగాన్ని, ప్రజాధన దోపిడిని అరికట్టాలి. కరొనా ముప్పునుండి ప్రజలను కాపాడాలి. అని ఆయన కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: