దీనావస్థ వ్యక్తికి ప్రజా సంఘాలు చేదోడు
సురక్షితంగా కూతురు వద్దకు చేరవేత
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
మానవ సేవయే మాధవ అన్నారు. రెండుకాళ్లు కుళ్ళి దీన స్థితి లో షానవాజ్ ఆసుపత్రి రోడ్డులో దీనంగా పడివున్న వ్యక్తిని ప్రజా సంఘాలు ఆదుకొన్నాయి. అల్ హింద్ సామాజిక సేవా సంఘం వారు ఈ విషయాన్ని ఉమర్ ఫారూఖ్ ఖాన్ కి తెలుపగా ఆయన ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాల మద్దిలేటికి విషయం తెలిపి సబ్ ఇన్స్ పెక్టర్ కరీం బాషా ఆధ్వర్యంలో ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ వ్యక్తి కూతురు బెంగళూరు లోని బాగ్ లూర్ క్రాస్ లోవుంటే ఆమెకు నచ్చ జెప్పి అల్ హింద్ సామాజిక సేవా సంస్థ ముజాహిద్ మిత్రబృందం ముస్లిం నగారా &టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్రబృందం వారి కూతురు కు అప్పగించటానికి అంబులెన్స్ లో స్వంత ఖర్చులతో పంపారు ఉమర్ ఫారూక్ ఖాన్. ముజాహిద్.బృందం మాట్లాడుతూ
కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం -వసుధైక కుటుంబాన్ని నిర్మిద్దాం .జాతీయ సమైక్యత మతసామరస్యం .పరమత సహనం.సోదరభావాన్ని ఆశయంగా ఆచరణాత్మక అడుగులేద్దాం ఉమర్ ఫారూఖ్ ఖాన్ ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మరియు అల్ హింద్ ఫౌండేషన్ ముజాహిద్ ఇదే మా ఆకాoక్ష ఆశయం అన్నారు ఈ కార్యక్రమంలో జమీయతుల్ ఉలమా ఏ హింద్ అధ్యక్షులు మౌలానా ముఖ్తియార్ అహ్మద్ బాఖవీ.దావతుల్ ఖైర్ హాఫీజ్ షఫీఖ్ అహ్మద్.అబ్దుల్ మాలిక్ .జనతా మెడికల్ అశ్వాక్. సాబిట్. దాదాఖలందర్.షాహిద్. జుబేర్.తదితరులు ఈ సేవాకార్యక్రమంలో పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: