శిరీష కుటుంభాన్ని ఆదుకోండి
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
కె.ఆర్. హరిప్రసాద్ బహుజన్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)
కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువు గరువు గ్రామంలో ప్రేమ మోసానికి గురై గతనెల18 వ తేదీ సాయంకాలం హత్యగావించిన శి గొడుగు నూరు శిరీష కుటుంభాన్ని ఆదుకోవాలని మంగలి మహసభ జాతియ సంఘం, బీసీ మహజన సమితి, ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకులు కె.ఆర్.హరిప్రసాద్ బహుజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డికి విన్నవించుకొన్నారు. ఎం.పీ.వై.ఎస్.అవినాష్ రెడ్డిని కలిసి ఆయన ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. శిరీష ను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: