జగన్నాధపురం పంచాయతీ ఎస్సీ కాలనీలో...
నిర్మాణ పనులు ప్రారంభం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని జగన్నాధపురం పంచాయతీ ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ గంట వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు, సైడు కాలువలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు గారు, పంచాయతీరాజ్ ఏఈ ఏ శ్రీనివాసరెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ కాలవలు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ఎస్ నరసింహులుమాట్లాడుతూ మండలంలో 16 పంచాయతీల గాను జగన్నాధపురం గ్రామపంచాయతీ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ నిధులతో గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ కాలవలు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ తేజస్విని, వి ఆర్ ఓ వెంకట్ రమణారెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైదులు తదితరులు పాల్గొన్నారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: