వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత
మెడికల్ కాలేజీల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయలి
భూసేకరణ...నిధుల విడుదలలో జాప్యం వద్దు
ఎక్కడా పనులు ఆగకూడదు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ దిశగా అధికార్లు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో నాడు–నేడు, వైయస్సార్ కంటి వెలుగు పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభం చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజీల కోసం భూసేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని ఆయన సూచించారు.
వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. దీనికి సంబంధించి నిధుల కొరత అనేది లేకుండా చూడాలన్నారు. ఇదిలావుంటే ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. అదే సందర్భంలో వైయస్సార్ కంటి వెలుగు పథకం గురించి చర్చ సాగింది. పథకంలో ఇప్పటి వరకు 66,17,613 మంది స్కూల్ పిల్లలకు పరీక్షలు నిర్వహించామని, వారిలో కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 293 పిల్లలకు ఆపరేషన్లు కూడా చేయించామని సీఎంకు అధికార్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60,393 స్కూళ్లను కంటి వెలుగు పథకంలో కవర్ చేశామని, కళ్ళద్దాలు అవసరమైన 1,58,227 మంది పిల్లలకు ఉచితంగా అద్దాలు పంపిణీ చేశామని అధికారుల వెల్లడించారు. పథకం మూడో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,09,262 మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేశామని, వారిలో 3,90,479 మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చామని, మరో 41,193 మందికి ఆపరేషన్లు కూడా చేయించగా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని వారు వివరించారు. ఇదిలావుంటే వైయస్సార్ కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్ల అద్దాల పంపిణీ చేయడంతో పాటు,, అవసరమైన వారికి ఆపరేషన్లు పూర్తి చేయాలని అధికార్లకు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని, అధికారులు తప్పనిసరిగా దీనిపై దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ ఛైర్మన్, ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున్తో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: