కరోనా కట్టడి చేసేదెవ్వరూ...?
నిబంధనలు లెక్క చేయకుండా జనంలో రోడ్డుపైకి
కట్టడి చేయాల్సిన వారు కనిపించని వైనం
అదే నిర్లక్ష్యానికి కారణమా..?
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టినా అసలు ఉద్దేశం పక్కదారిపడుతోంది. లాక్ డౌన్ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏమిటీ అన్నది ప్రజల్లో కనిపించడంలేదు. ఇలాంటి ఘటనలు కర్నూలు జిల్లా గడివేముల లో మనకు నిత్యం దర్శనమిస్తున్నాయి. వ్యక్తినుంచి వ్యక్తికి కరోనా వ్యాపిస్తోందని, అందుకే లాక్ డౌన్ విధించారన్న వాస్తవం ప్రజల్లోకి పంపడంలో అందరూ విఫలమయ్యారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉన్నా గడువు సమయం దాటినా గడివేముల ప్రాంతంలో జనం రోడ్లను మాత్రం విడవటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ఉద్దేశం ఎక్కడ కనిపిస్తోందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు గుంపులు, గుంపులుగా రోడ్డుపైకి రావడం, వాహనాలతో రావడంతో గవివేముల పరిధిలో కరోనా నిబంధనల ఉల్లంఘనలు యథేచ్చగా సాగుతున్నాయి. లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నది పోలీసు యంత్రాంగం అని అందరికీ తెలియదు. పోలీసుల రాకలేకపోవడం కూడా జనాలు రోడ్డుపైకి విస్త్రుతంగా తిరుగుతున్నారు అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: