ఇంకా మేలు చేయాలని వుంది

ఆ అవకాశం దేవుడు నాకివ్వాలి

పుంగనూరు బస్సు డిపో ప్రారంభోత్సవంలో సీఎం వై.ఎస్.జగన్

కడప బస్ స్టేషన్ కు వైఎస్సార్ బస్ స్టేషన్ గా నామకరణం

ఇలాంటి సీఎం ఉండటం మన అదృష్టం-మంత్రి పేర్ని నాని

బస్సు స్టేషన్ పుంగనూరు వాసులకు వరం-మంత్రి పెద్దిరెడ్డి 


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)

ఇచ్చిన మాటకు కట్టుబడ్డానని, ఇంకా ఎంతో మేలు మీకు చేయాలని ఉందని ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు బస్సు డిపో. కడపలో ఏపీఎస్‌ఆర్టీసికి చెందిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప బస్‌ స్టేషన్‌కు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్‌ స్టేషన్‌గా పేరు మార్పు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. కోవిడ్‌ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టమని సీఎం వ్యాఖ్యానించారు. మీకు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నాను అని ఆయన వెల్లడించారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి తీసుకువచిందన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగిందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని ఆయన గుర్తుచేశారు. 50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3600 కోట్ల భారం ఏటా పడుతున్నదని ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం వెనుకంజ వేయలేదన్నారు. అంత  గొప్ప మనసున్న వ్యక్తి సీఎం అని ఆయన ప్రశంసించారు. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం. మరోవైపు పుంగనూరు డిపోను ప్రారంభించడం జరిగిందని, కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న సీఎం మనకు ఉండడం ఎంతో అదృష్టం’ మంత్రి పేర్కొన్నారు. మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...


సీఎం వై.ఎస్.జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఇవాళ నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పుంగనూరు డిపోను ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు. పుంగనూరు ప్రజలకు ఇది ఎంతో వరమని ఆ పట్టణం 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపోలేదని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ కొరత నేడు పూర్తయిందని తెలిపారు. మహానేత వైయస్సార్‌ హయాంలో పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత కాలంలో అవి ముందుకు సాగలేదని మళ్లీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ దాన్ని పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు. ఇదిలావుంటే మొత్తం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు బస్సు డిపో నిర్మాణం చేశారు. 65 బస్సులతో డిపో ఏర్పాటు కాగా, ఆ డిపోను ఒక మోడల్‌ డిపోగానూ, అదే విధంగా డిపోలో మోడల్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించారు. 1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా, ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు, హౌజ్‌ కీపింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో  వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు. దాదాపు 90 వేల మందికి కడపలోని డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి సేవలు అందించనుంది. దీంతోపాటు కడప ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా పేరు మార్పు చేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్‌ బాష, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: