ఆనందయ్య ఆయుర్వేదం
ప్రజలకు ఒక కొత్త అవగహన కల్పించింది
జెడ్ కేటగిరీలో ఆయనకు రక్షణ కల్పించాలి
వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్
(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య కోవిడ్ వైద్యం రాష్ట్ర ప్రజలలో ఒక కొత్త నూతన ఉత్సాహం ,ఆశ కల్పించిందని, రోగనిరోధక శక్తికై ఈ దృక్పథం అత్యంత అవసర మని న్యాయవాది, వెల్ఫర్ పార్టీ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వై.ఆనందయ్య ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఒక కొత్త ఒరవడి నేర్పిందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య సేవలను రాష్ట్రంలో ఉపయోగించు కోవాలని ఆయన కోరారు. కోవిడ్ నియంత్రణకు ఆయన్ని సలహదారునిగా నియమించాలని ఆయన కోరారు. ఆనందయ్యకు జెడ్ కేటగిరీ రక్షణ కలిపించాలని కోరారు. కరోనా రాకుండా కాని కరోనా చికిత్సకు గాని దేశవ్యాప్తంగా సరైన సదుపాయాలు లేనప్పుడు అత్యంత చౌకగా వేగంగా ఆనందయ్య అయిర్వేదం ప్రభుత్వం ప్రతీ వాలంటీర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో కి తెచ్చి ప్రపంచానికి ఒక దశ,దిశ చూపి ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. ఆయుర్వేదం యునాని,హోమియో మందులను వాటిని ప్రోత్సహించాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాయనున్నట్లు ఐ.ఎం.అహమ్మద్ తెలిపారు. ఈ సమావేశంలో లాయర్స్ ఫర్ సోషల్ జస్టీస్ అధ్యక్షులు న్యాయవాదీ జి సుబ్బారావు, మక్కా మజీద్ కార్యదర్శి అమీర్ జాన్ తదితరులు మాట్లాడారు.
Post A Comment:
0 comments: