ముస్లిం నగారా ఆధ్వర్యంలో...

అన్నధాన కార్యక్రమం...మాస్క్ ల పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కోవిడ్ మహమ్మరిని తరిమి కొడదాం చైతన్య కార్యక్రమంలో భాగంగా హిందూపురం పట్టణం లోని ఆటోనగర్ ప్రాంతంలో ని భగీరథ సర్కిల్ లో డేరాలు వేసుకొని చాలీ చాలని బ్రతుకు లీడుస్తున్న ఓ పీడిత సామాజిక వర్గం 100కుటుంబాలకుమరియు కోవిడ్ బాధితుల కు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఏ.సీ.ఎన్ సిల్క్ నాగరాజు. లక్ష్మీ.శ్వేత. సుష్మ.మురళి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100కుటుంబాలకు  అన్న దానం మరియు మాస్కులు పంపిణీ చేశారు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరిగింది ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ

కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని కూకటి వేళ్ళతో పెకిలించాలని జ్వరంతో వాసన కోల్పోయి దగ్గు జ్వరము తో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని కోవిడ్ బాధితులుగా నిర్ధారణ అయితే కోవిడ్ క్వారంటయిన్ సెంటర్ల లో భర్తీ అయి ఆరోగ్యవంతులు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్.దారుల్ యతామా అధ్యక్షుడు రియాజుల్లా ఖాన్ టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.సుల్తాన్. తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలో కోవిడ్ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

 



 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: