ఆక్సిజన్...మందులు అందుబాటులో ఉంచాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ తోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. విజయనగరంలోని మహరాజు ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక, విశాఖపట్టణంలో కోవిడ్ బాధితులకు పడకలు అందక మరణించిన ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు. ఈ ఘటనలు విచారకరమన్నారు. ఈ సౌకర్యాల కల్పన దిశగా ఏపీ సర్కార్ శ్రద్ద పెట్టాలని ఆయన కోరారు.అత్యవసర ఔషదమైన రెమిడి సివల్, ఇతర మందులను ప్రైవేటు మెడికల్ షాపులో బ్లాక్  గా అమ్ముతున్నారని, దీనిపై ప్రభుత్వం చూసిచూడకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వేలకొద్ది అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని గొప్పలు చెపుకొనే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ బాధితులను ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడటంలో ఎందుకు విఫలమవుతోందని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరాపై ఆడిట్ చేయించి అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: