ముఖ్య కూడళ్లలో...
అబేంద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
నంద్యాల పట్టణంలోని ముఖ్య కూడళ్లలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా మున్సిపల్ కౌన్సిల్ ను ప్రత్యేకించి సమావేశపర్చి కౌన్సిల్ లో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాలలోని ప్రధాన కూడళ్లలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ స్పూర్తిని భావితరాలలో నింపాలని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రభుత్వంలోని పెద్దలు అశ్రద్ద వహిస్తే పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: