“కరోనా నియంత్రణలో భాగంగా,,,

 వ్యాక్సిన్ పై అవగాహన “ 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

1.వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?

జ.: ఉంది. వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

2.వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?

జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్‌లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.

3.వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?

జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది

4.వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?

జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

5.ఓవరాల్‌గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?

జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.

     ఈ విధంగా మనమంతా మాస్క్ ను ధరించడంతో పాటు భౌతికదూరం పాటిస్తూ , మన ఆరోగ్యాలతో పాటు మన కుటుంబ మరియు మన పరిసరాలలో వున్న వారి ఆరోగ్యాలను సైతం రక్షించిన వారమవ్వాలి........

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్- బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: