అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో అగ్రిగోల్డ్ బాధితులు 20 లక్షల మంది కుమిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని హామీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు. కానీ కేవలం రూ.240 కోట్లు మాత్రమే విడుదల చేసి రూ.10,వేల లోపు బకాయిలున్న వారికే చెల్లించారని ఆయన పేర్కొన్నారు. ఇతర బాధితులకు మాత్రం ఇటువంటి సాయం చేయకుండా విస్మరించడం శోచనీయం అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణ న్యాయం చేసేలా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: