కరోనా ప్రభావం దృష్ట్యా,,,
గద్వాల్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం
విధులను నిలిపివేయాలని తీర్మానం
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
సుమారు 15 మంది న్యాయవాద మిత్రులు కరోనా బారిన పడడంతో 9 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు విధులను నిలిపి వేయాలని గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రవంగా తీర్మానించింది. ఉద్యోగస్తులు కూడా కరోనా బారిన పడకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సెకండ్ వేవ్ కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యాయవాద మిత్రులందరూ అంగీకార యోగ్యంతోనే నిర్ణయించారు. జూనియర్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడకుండా బార్ అసోసియేషన్ తగు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: