ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ, జానోజాగో సంఘం ఆధ్వర్యంలో...
అంబేద్కర్ కు ఘన నివాళ్లులు
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని వేడుకలు స్థానిక నంద్యాల పట్టణంలోమసుల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక).ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మసుల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ ఎం డి ఫరూక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎన్ డి రహిమాన్ జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఓ మహానుబావుడా దళిత జాతి రత్నమా, మా బానిస సంకెళ్లు తెంచిన యోధుడ,మాకు జీవితాలను ఇచ్చిన నిన్ను మార్వలేము మా గుండెల్లో గుడి కట్టి జీవిస్తున్నము. దళితునిగా ఉండి విద్యార్థి దశ నుండి ఎన్నో అవమానాలు భరించి దళితులు అంటరనివాళ్లుగా చూస్తున్న ఉన్నత వర్గాల వారికి కళ్ళు తెరిపించి అందరూ సమానం అనేలా నిరూపించి ఎన్నో ఉన్నత చదువులు చదివి చివరకు మన భారత రాజ్యాంగాన్ని రచించి న యోధుడు అంబెద్కర్ అని కొనియాడారు.కుల,మత, వర్గ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా చేసుకొని దేశం లోని ప్రజలందరు సమానత్వం తో జీవించాలని కోరుకున్నాడు.అదే విధంగా దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరి పైన వివక్షత చూపుతున్న వారి కళ్ళుతెరిపించేలా చేసిన మహానీయుడు మన అంబెద్కర్.అయ్యా అంబెడ్కర కనిపించని దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కాని కనిపించే మా దైవం నువ్వెనని,మనుషులు మనుషులు గా బ్రతకడానికి ఎన్నో అవకాశాలు కల్పించావని, చీకటి బ్రతుకుల వెలుగు అయ్యాడని ఆయన ఆశయ సాధనకోసం విద్యార్థి యువజనుల ముందుకు నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ హుస్సేన్ ఎస్ ఇలియాస్ జనార్ధన్ పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: