ఆలేరు లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం ఆలేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు, పార్టీ కార్యాలయం ముందు, పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ పార్టీ పతాక ఆవిష్కరణ చేసారు, మరియు 12 వార్డు రంగనాయక దేవాలయం దగ్గర బీజేపీ సీనియర్ నాయకులు నంద్యాల ప్రతాప్ రెడ్డి,వివిధ బూత్ లలో నాయకులు పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు దేశ భక్తి సిద్ధాంతం సాంఘిక, సంస్కృతి పరిరక్షణ ద్యేయంగా ఎందరో బీజేపీ పార్టీ మహనీయుల కృషి ఫలితంగా 1952లో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన మాతృ పార్టీ అయినా జనసంఘ్ నుండి 24 సంవత్సరాల అనంతరం 1980 ఏప్రిల్ 06 న మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజపేయి, సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అధ్వని గార్లు బీజేపీ పార్టీ స్థాపించి నేటికీ 41 సంవత్సరాల నుండి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రజాశ్రేయస్సు, దేశ రక్షణ,అభివృద్ధి, కోసం ఎన్నో రకాల సేవ కార్యక్రమలు, పథకాలను ప్రవేశపెట్టిందని,
దేశ సేవ ముందు తరువాత పార్టీ, చివరగా తనకోసం ప్రతి కార్యకర్త సిద్ధాంతం ప్రకారం పనిచేయాలని రానున్న 2023 లో దేశం లో రాష్ట్రం లో మరొక్కసారి బీజేపీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్, ఉపాధ్యక్షులు కౌన్సిలర్ సంగు భూపతి, జెట్ట సిద్దులు, కటకం రాజు,పస్తం ఆంజనేయులు, నంద గంగేష్,పేరపు ఆనంద్, ఎండి మక్షుద్, జిల్లా సీనియర్ నాయకులు చెరుకూరి సిద్ధిలింగం,పసుపునూరి వీరేషం,మైదo ఆంజనేయులు చిరిగే శ్రీనివాస్,ఐడియా శ్రీనివాస్,తునికి దశరద, తోట మల్లయ్య, కటకం నందం,సత్యనారాయణ,నర్సింహారెడ్డి, గోకరకొండ శ్రీనివాస్,ఎనగందుల రమేష్, కళ్లెం రాజు,అయిలి సందీప్, పడాల శ్రీనివాస్,పత్తి రాములు,కూడికల మురళి, రాచర్ల క్రిష్ణ,పూల హనుమంతు,పాశికంటి సంపత్,గణగాని రాంచందర్, మంత్రి భాస్కర్,ఎగ్గిడి సిద్దులు,పెండెం శ్రీనివాస్, రాపోలు ప్రకాష్, కొత్త సాయి,కందుల బిక్షపతి, పాశం జంపయ్య,బండ్రు చంద్రం, పాశికంటి భాస్కర్, బాబురావు, బద్రినాథ్, సునీల్ పాల్గొన్నారు
Post A Comment:
0 comments: