కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం
ముస్లిం నగరా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన రక్త దానం చేద్దాం కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం అనే కార్యక్రమం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత దాదాపు 50రోజుల వరకు రక్తదానం చేయకూడదు అని వైద్యులు అంటున్నారని కోవిడ్ మహమ్మారి సమయంలో రక్తం కొరత తీవ్రంగా ఉందని ప్రతి ఒక్క ఆరోగ్యవంతులు రక్తదానం చేసి సహకరించాలని ప్రాణదాతలుగా మారాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో 4.5కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలోమూడు కోట్ల యాభై లక్షల మంది తలసీమియా మహమ్మారి తో బాధ పడుతున్నారని ప్రతి 20రోజులకు రక్తం దాతల ద్వారా దొరకక పోతే మరణమే శరణ్యమని ప్రతి 18సంవత్సరాలనుండి 55సంవత్సరాల ఆరోగ్యవంతులు బ్లడ్ బ్యాంక్ రక్త నిధి కి వెళ్లి స్వచ్ఛoదంగా రక్తదానం చేసి కోట్లాది తలసీమియా బాధితుల కు ప్రాణదానం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు స్వచ్చందంగా తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తనిధి కి వచ్చి రక్తదానం చేసిన షేఖ్ సనావుల్లా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో .టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్.టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొని రక్తదాతలకు అభినందించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: