నంద్యాల ప్రముఖులకు,,,
జమాఆతె ఇస్లామీ బృందం
తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా కడుపాలని ఆకాంక్షించిస్తు నంద్యాల జమాఆతె ఇస్లామీ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట కృష్ణుడు,రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డా. జీ రామకృష్ణారెడ్డి, అడ్వకేట్ రావినూతల దుర్గాప్రసాద్, కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్, ట్రాఫిక్ సి. ఐ శ్రీ ప్రభాకర్ రెడ్డి, 2వ పట్టణ సీ. ఐ కమ్మగిరి రాముడు, డా. ఉదయ శంకర్, డా. రవి క్రిష్ణ, కేబుల్ జర్నలిస్టులు రాజేష్, సురేష్. తదితరులు ఉగాది గ్రీటీంగ్స్ పంపిణి చేసారు.
జమాఆతె ఇస్లామీ యూనిట్ అధ్యక్షులు సీ. యం. జకరియా, కార్యదర్శి అబ్దుల్ సమద్, వరంగల్ సలీం, పెన్నాల షఫీ, ఫయాజ్, ఐవైయం జమా, రషీద్ బృందం ప్రముఖులు కలిసారు. ఈ సంధర్భంగా జకరియా, సమద్ మాట్లాడుతూ దేశవాసులకు మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలని, పరస్పర అభిప్రాయాలు గౌరవించుకొని మతాల మధ్య ఐక్యత అవగాహన పెంచుకోవాల్సిన అవసం ఉందని తద్ద్వార పరస్పర అనుబంధాలు పటిష్టపడుతాయని, అందుకే జమాత్ ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. జమాత్ టీమ్ ను ప్రముఖులు ఆదరించి నాయకులను కలవటాన్ని స్వాగతిస్తు అభినందించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: