పోలీస్ కుటుంబాల సంక్షేమంకోసం

కొవిడ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

కోవిడ్ సమయంలో పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమంకై కార్పొరేటు హాస్పిటల్   వసతులతో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ప్రారంభించారు. శుక్రవారంనాడు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా ఏర్పాటుచేసి  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఐ.పీ.ఎస్. ప్రారంభించినారు. కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా పోలీసు సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లుగా ఎస్పీ గారు తెలియచేసినారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దృష్ట్యా పోలీసు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకొన్నామని, ఎవరైనా పోలీసు సిబ్బంది కరోనా వ్యాధి ప్రభావానికి గురైనట్లుయితే వారికి తక్షణ వైద్య సదుపాయం అందించనున్నట్లు తెలియచేసినారు. కరోన వ్యాధి లక్షణాలు ఉన్న  పోలీసు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులకు తక్షణమే కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించి, పాజిటివ్ అని తెలిసిన వెంటనే త్వరితగతిన వైద్యం అందేలా చర్యలు చేపట్టిన్నామని తెలియచేసినారు.
పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈ కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులో వుండే విధంగా 45 సాధారణ పడకలు+ 10 ఆక్సిజన్ పడకలు మొత్తం:55 పడకలతో మహిళకు మరియు పురుషులకు ప్రత్యేకమైన బ్యారక్ లతో ఈ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. సిబ్బందికి మానసిక ఉల్లాసాన్ని కల్పించి వారిలో మనో ధైర్యాని నింపడానికి టెలివిజన్ లను మరియు ఇంటర్ నెట్ సదుపాయాలను ఈ బ్యారక్ లలో కల్పించిన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేయుటకై తగిన ఏర్పాటుచేసినారు. పోలీస్ సిబ్బంది కోవిడ్ కు సంబంధించి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న యెడల డిటిసి నందలి కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్: 9121102270 కు సమాచారం అందించి, తక్షణ సహాయం పొందాలని తెలియచేసినారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు ప్రత్యెక రిసెప్షన్ ను ఏర్పాటు చేసినట్లు, అదే విధంగా డిటిసి నందు కోవిడ్ బారిన పడిన సిబ్బందికి  24/7  అంబులెన్స్ సదుపాయం ఉంటుదని పేర్కొన్నారు. అదే విధంగా కోవిడ్ కేర్ సెంటర్ నందు వైద్య సదుపాయం పొందుచున్న సిబ్బంది మరియు కుటుంబ సభ్యులకు మూడు పూటల  ప్రతి రోజు పౌష్టికాహారంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేందుకు డ్రై ఫ్రూట్స్ ను అందించేందుకు చర్యలు చేపట్టినామని, శానిటైజర్లు, మాస్క్ లు, థర్మల్ స్కానర్స్ ను ఏర్పాటుచేసినామని ఎస్పీ తెలియజేశారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందరూ మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంటారని, అదేవిధంగా కోవిడ్ సోకిన సిబ్బందికి కావలసిన వైద్య పరికరాలు, మందులు అన్ని అందుబాటులో ఉంటాయని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సిబ్బందికి అన్నివేళలా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకై తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 
అదే విధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ కి ఇన్చార్జిగా ఉన్న డీటీసీ, డీఎస్సీ జి.రామకృష్ణ డిటిసి లో వున్న కోవిడ్ బారిన పడిన సిబ్బందిని 24/7 పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషల్ ఎస్పీ (అడ్మిన్) బి.రవిచంద్ర, డీటీసీ డిఎస్సీ జి.రా

మకృష్ణ, డీఎస్బీ డీఎస్సీబి. మరియదాసు, ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్,దిశ డిఎస్సీ యం.ధనుంజయుడు, ఎఆర్ డిఎస్పీ కె.రాఘవేంద్రరావు, ఒంగోలు పీటీసీ డాక్టర్ డి.మానస, ఎస్బి-1 సీఐ వి.సూర్యనారాయణ, డీటీసీ సీఐ యం.శ్రీనివాసరావు, కమాండ్ కంట్రోల్ స్పెక్టర్ ఆర్.రాంబాబు, తాలూకా సిఐ శివరామ కృష్ణ రెడ్డి, ఆర్ఐ లు జె.హరి బాబు, బి.శ్రీకాంత్ నాయక్, సీహెచ్.సుబ్బారావు, జి.శ్రీహరి బాబుగారు, డీటీసీ అర్ఐ వెంకటేశ్వర రావు, డాక్టర్లు, నర్సులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: