సున్నా వడ్డీ పై...
రైతులతో లైవ్ ప్రోగ్రాం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామములోని రైతుభరోసా కేంద్రము నందు డాక్టర్ వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పధకానికి సంబంధించిన పంట రుణాలు 2019-రబీ గురించి ఎమ్.పి.ఇ.ఓ. ఎమ్. మలిలికార్జున ఆధ్వర్యములో రైతులకు లైవ్ ప్రొగ్రామ్ చూపించడం జరిగింది. ఈ పధకం ద్వారా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు వడ్డీ రాయితీ వర్చువల్ విధానం ద్వారా రైతుల ఖాతాలలో నేరుగ జమా చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎ.డి.ఎ) శేఖర్ బాబు, తర్లుపాడు ఎమ్.పి.డి.ఓ. నరసింహులు, ఎమ్.పి.ఇ.ఓ, ఎ.ఇ.ఓ. రైతులు పాల్గోన్నారు. తదుపరి ఎ.డి. ఓ. గారు మాట్లాడుతూ మొత్తం తర్లుపాడు మండలము నందు 499 మంది రైతులకు 13,85,315 రూపాయాలు వడ్డీ రాయితీ నేరుగా రైతుల ఖాతాలలో జమా చేయజం జరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: