కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ బాషా డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో బియ్యం కేంద్ర ప్రభుత్వం పంపిణి చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ టెస్టింగ్ పరీక్షలు వాటి ఫలితాల మధ్య సమయం చాలా పడుతోందని ఆయన అన్నారు. ఇది కూడా కోవిడ్ విస్తరణకు కారణంగా ఆయన పేర్కొన్నారు. టెస్టింగ్ ఫలితాలు వెంటనే వస్తే కరుణ కట్టడికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని వాటి ద్వారా రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: