మహాత్మ జ్యోతి రావుపులేకు ఘన నివాళి
నివాళులర్పిస్తున్న నాయకులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
మహాత్మ జ్యోతి రావు పులే 195వ జయంతిని పురస్కరించుకుని పలువురు నాయకులు ఘన నివాళులర్పించారు. బెస్తకార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గిరిబోయిన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుల విపక్షకు వ్యతిరేకంగా సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు అని కొనియాడారు. పద్మావతి నగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సేవా సంఘం అధ్యక్షులు పుట్ట శివ, ఏ చంద్రశేఖర్, పిల్లి నాగేంద్ర, రామ్మోహన్, బాలాజీ, వెంకట సుబ్బమ్మ, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: