వైస్ ఛైర్మన్ కె.ఇస్మాయిల్ కు...
ఎన్.ఎం.యూ నేతల సత్కారం
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపరం ప్రతినిధి)
మార్కాపురం మునిసిపల్ వైస్ ఛైర్మన్ ఎస్.కె.ఇస్మాయిల్ ని వారి స్వగృహంలో మార్కాపురం ఎన్.ఎం.యూ.ఏ(నేషనల్ మజ్దూర్ యూనిటి అసోసియేషన్)నాయకులు, కార్యకర్తలు కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిచయ కార్యక్రమంలో డిపో కార్యదర్శి కె. కాశయ్య,అధ్యక్షుడు మూర్తి, ,రీజినల్ నాయకులు నాగిరెడ్డి,మల్లికార్జున రావు,గ్యారేజ్ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి,కృష్ణ మూర్తి,రమేష్ బాబు, టీవీఎస్, శివారెడ్డి, శ్రీనివాస రెడ్డి, జీ.వీ.రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డిపో కార్యదర్శి కాశయ్య ధన్యవాదాలు తెలిపినారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్ మాట్లాడుతూ నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను నా వంతు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని తెలిపారు. మీరు చూపించే అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: