ప్రజల దాహార్తి తీర్చడానికి చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు
- అయిదు ప్రాంతాల్లో ప్రారంభం
- వైసీపీ సీనియర్ నాయకులు, సిఇసి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
వేసవికాలం. గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేకాలం పోయింది.. గ్లాసు మంచినీళ్లు తాగాలన్నా డబ్బు పెట్టి కొనాల్సిందే. ప్రభుత్వాలు చలివేంద్రాలు ఏర్పాటులో ఆలస్యం వహిస్తుంది. పట్టణానికి రోజు గ్రామాలనుంచి వస్తుంటారు. వ్యయప్రయాసాలు పడి వచ్చిన వారికి మంచినీరు దొరకని పరిస్థితి. ప్రజల దాహార్తిని గమనించారు వైసీపీ సీనియర్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు వేసవికాలంలో చల్లటి మంచినీటిని అందించాలని అనుకున్నారు. మదిలో ఆలోచనలకు మూడేళ్ళక్రితం కార్యరూపం దాల్చారు. పదవులు వచ్చినా, రాకపోయినా ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో ప్రతి యేటా వేసవికాలం ప్రారంభం నుంచి వేసవి కాలం చివరి వరకు ప్రజలకు అందుబాటులో అవసరమయ్యే ప్రాంతాల్లో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు నెలకొల్పుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నంద్యాల పట్టణంలో నూనెపల్లి, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రాంతాల్లో చల్లటి మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడవులకంటే ప్రజా సేవలోనే తృప్తి ఉంటుందని అన్నారు. కరోనా సెకెండ్ వేవ్ లో ప్రజలు వాటర్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్ కొనాలన్నా భయపడే రోజులన్నారు. చలివేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు చల్లటి మినరల్ వాటర్ ను అందిస్తే, వారి చల్లని దీవెనలు చాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యూసఫ్, ప్రసాద్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: