నంద్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభం

- పాల్గొన్న.ఎంపి పోచా, ఎమ్మెల్యేలు కాటసాని,  శిల్పా రవి, గంగుల

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల టీటీడీ రోడ్డులో అత్యాధునిక అత్యవసర చికిత్స కోసం ఏర్పాటుచేసిన నంద్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రిని నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి  క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించగా, నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, అళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేందర్రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ గెలిచి సహదేవుడు, డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ చంద్రశేఖర్ క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్లు, లేబరేటరీ, ఎక్సరే తదితర విభాగాలను ప్రారంభించారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ నాగ సుమంత్ రెడ్డి డాక్టర్ వరదరాజ్, డాక్టర్ వివేక్, డాక్టర్ దిలీప్, డాక్టర్ కరిష్మా బృందం ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ఆస్పత్రిలో అత్యవసర చికిత్సా విభాగం, ఆపరేషన్ థియేటర్లు నగరాల స్థాయిలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా  రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల బిజెంద్ర రెడ్డి, డాక్టర్ రవికృష్ణ తదితరులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నగరాల స్థాయిలో ఆధునిక పరికరాల వసతులతో ఆస్పత్రి ఏర్పాటు చేయడం నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి  మాట్లాడుతూ తమ ఆస్పత్రి ద్వారా అత్యవసర చికిత్స అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల ప్రాంతానికి చెందిన ప్రముఖులు వైద్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: