ప్రభుత్వ భూములను అసైన్డ్ గా మార్చేసి..
ఎట్టకేలకు నిందుతుడు కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్లైన్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. మరో ఐదు మంది అధికారులు అరెస్టుకు రంగం సిద్ధమైంది. తర్లుపాడు మండల తహసీల్దార్ మల్లికార్జున ప్రసాద్ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పోలా. భాస్కర్ ఆదేశానుసారం తర్లుపాడు రెవెన్యూ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే యజ్ఞం, పవన్ కుమార్ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్లైన్ చేసే క్రమంలో అధికారులకు నమ్మకం గా ఉంటూ మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి ఎస్ ఐ ఆవుల. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు, మంగళ కుంట, నాగేళ్లముడుపు, లక్ష్మక్క పల్లి, మీర్జా పేట గ్రామ తో పాటు మరి కొన్ని గ్రామాలకు సంబంధించిన సుమారు 440 ఎకరాలను 180 మంది రైతులకు అక్రమంగా ఆన్లైన్ చేసినట్లు కేసు విచారణలో తేలిందని ఎస్ ఐ ఆవుల ఆవుల. వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కంప్యూటర్ ఆపరేటర్ అయినా యజ్ఞ, పవన్ కుమార్ లను అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మార్వో బీరం. విజయ భాస్కర్ రెడ్డి, ఆర్ ఐ లు సాలమ్మ, రమణ మరియు వి ఆర్ వో లు రామ్మోహన్ రావు, మల్లికార్జున రావు లను అరెస్టు చేయవలసి ఉందని త్వరలోనే వీరిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: