అంతరాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద...
భారీగా బంగారం స్వాధీనం
మార్కెట్ విలువ 6 కోట్ల 86 లక్షలు
పన్ను చెల్లింపులేకుండా. బిల్లులు లేకుండా తరలిస్తున్న 14.8 కేజీల బంగారం స్వాధీనం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కడప జిల్లా రైల్వే కోండాపురం మండలం తాళ్ళ ప్రొద్దూటూరు గ్రామానికి చెందిన రాతి మిద్దె రాజా (40 సం.) అనే వ్యక్తి తాడిపత్రి మెయిన్ బజార్లో అంబటి పుల్లారెడ్డి జ్యూవెలర్స్ షాపులో పని చేస్తున్నాడు. రాతి మిద్దె రాజా 24న హైదరాబాద్ కు వెళ్ళారు. హైదరాబాదులోని అబిడ్స్ లోని మనో కామన గోల్డ్ షాపు నుండి ఒక్కొక్కటి 100 గ్రా. బరువు కలిగిన 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. ఆ బంగారం బిస్కెట్లలోని 15 బంగారు బిస్కెట్లను హైదరాబాద్ లోని వేరే వేరే ప్రాంతాలలో ఇచ్చారు. మిగిలిన 148 బంగారు బిస్కెట్లను తీసుకుని హెదరాబాద్ నుండి కర్నూలు వైపు మీదుగా ఆర్టీసి బస్సులో వస్తుండగా
25న తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో పంచ లింగాల చెక్ పోస్టు వద్ద గల సెబ్, లోకల్ పోలీసు వారు వాహన తనిఖీలు నిర్వహించగా పైన తెలిపిన రాతి మిద్దె రాజా నుండి సరైన బిల్లులు, ఈవే బిల్లులు, ఆధారాలు లేకుండా ఉన్నందున పోలీసు ప్రోసిడింగ్స్ ద్వారా సదరు 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై కర్నూలు తాలుకా పోలీసులు క్రైమ్ నెంబర్ 245/2021 U/Sec 102 CRPC క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం బంగారు 14.8 కేజిలు. వీటి యొక్క విలువ 6 కోట్ల 86 లక్షలు. శుక్రవారం కర్నూలు పట్టణ డిఎస్పీ కార్యాలయంలో కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను సంబంధిత ఆదాయ పన్ను శాఖ, స్టేట్ టాక్స్, కస్టమ్స్ అధికారులకు తెలియపరచి సరైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కర్నూల్ తాలుక సీఐ విక్రమ్ సింహా, సెబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య ఉన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: