నంద్యాల నియోజకవర్గంలో 20కుటుంబాలకు
రూ.47 లక్షల భీమా అందజేసిన ఎమ్మెల్యే శిల్పా
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల 34వ వార్డు వెంకటాచలం కాలనీలో వైఎస్సార్ భీమా లబ్ది పొందిన లబ్దిదారుడు పీరాంసాకు నంద్యాల శాసన సభ్యులు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల నియోజకవర్గంలో 20కుటుంబాలు 47 లక్షల భీమా లబ్ది పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.510 కోట్లతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నాం కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతంలో ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్ను కూడా కేంద్రం తొలగించింది. వ్యక్తిగతంగా అకౌంట్ ఉన్న వారికే కేంద్రం బీమా సౌకర్యం కల్పించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి అన్నారని నంద్యాల శాసన సభ్యులు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: