మృతుని కుటుంబానికి వైఎస్ ఆర్ భీమా
రూ-10 వేల నగదును అందించిన కౌన్సిలర్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణం జ్ఞానాపురంలో కిషోర్ అనే వ్యక్తి మృతిచెందడంతో ఆ కుటుంబానికి వైఎస్ ఆర్ భీమా మంజూరైనట్లు కౌన్సిలర్ ఎద్దు మనోరంజని పేర్కొన్నారు. జ్ఞానాపురంకు చెందిన కిషోర్ సహజమరణం పొందారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మనోరంజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ భీమా ద్వారా మృతుని కుటుంబానికి 2 లక్షలు మంజూరు చేసారన్నారు. ఈ నేపథ్యంలోనే మృతుని భార్య ప్రియాంకకు 10 వేల ఆర్టిక సహయం అందించారు. భీమా డబ్బు ఏప్రిల్ నెలలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎద్దు రవి, వార్డు వాలేంటర్లు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: