ఫిబ్రవరి 2021

 తర్లుపాడులో ఘనంగా టైలర్స్ డే

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

        ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం నందు     "టైలర్స్ డే "కార్యక్రమం జరిగినది.  తర్లుపాడుమండలం లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టైలర్స్ సృష్టికర్త   విలియం హోవే, కే ఎం.  స్వామి "టైలర్స్ డే  కృషిరత్న " కృషితో టైలర్స్ డే జరుపుకోన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళ టైలర్స్ గౌరవ అధ్యక్షురాలు కంది. ప్రమీలా రెడ్డి మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర టైలర్స్ అందరికీ లక్ష  కేటాయించడం జరిగింది. అప్పట్లో టైలర్స్ అందరికీ ఆ బడ్జెట్ సరిపోదని అట్లాగే ఉంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా టైలర్స్ అందరికీ ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు. జగన్ అన్న తోడు పథకం ద్వారా ఒక్కొక్క టైలర్స్ కు పది వేలు కేటాయించడం జరిగిందన్నారు.
కొందరికి డబ్బులు రాని ఎడల మళ్లీ సచివాలయం కార్యాలయం లో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వస్తాయని ఆమె అన్నారు. నెహ్రూ యూత్ అధ్యక్షుడు పుల్లయ్య మాట్లాడుతూ టైలర్స్ అందరికీ పనులు కల్పించాలని రెడీమేడ్ వచ్చినతర్వాత టైలర్స్ అందరికీ పనులు లేకుండ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ద్వారా టైలర్స్ కు ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ద్వారా ప్రమీల రెడ్డిని శాలువాతో సన్మానించారు. హాస్టల్ పిల్లలకు యూనిఫాం అందజేశారు.    ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కౌన్సిల్ సభ్యుడు సూరెడ్డి. రామ సుబ్బారెడ్డి, జిల్లా టైలర్స్అధ్యక్షుడు నాగిరెడ్డి, పుల్లయ్య, డి. కాసిం, మండలంలోని టైలర్స్, మహిళా టైలర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  


 

 మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర సదస్సు...

పాల్గొన్న ఖమ్మం జిల్లా ఎం.పి.జె. నాయకత్వం..

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఆదివారంనాడు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగానున్న జిల్లాల బాధ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చ సాగింది. సామాజిక వర్తమాన రాజకీయాలతోపాటు ఎంపీజే చేపట్టాల్సిన కర్తవ్యాలపై కూడా దశాదిశా నిర్దేశ చర్చ సాగింది.  ఈ సదస్సులో ఖమ్మం జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు ఎస్.కె. ఖాసిం, కార్యదర్శి సతీష్ చౌదరి తో కలసి ఈ సదస్సులో పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

 

 కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను..

కలసిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.

కరోనా సమయంలో డాక్టర్ ఏలూరి సేవలను కొనియాడిన యడ్యూరప్ప

ఎస్ ఆర్సీ లాబొరేటరీకి  ఉజ్వల భవిష్యత్తు.. యడ్యూరప్ప ధీమా

(జానోజాగో వెబ్ న్యూస్-న్యూస్ నెట్ వర్క్)

కర్ణాటక రాష్ట్ర  ముఖ్యమంత్రి యడ్యూరప్ప పుట్టినరోజు సందర్భంగా నిన్న బెంగుళూరులో  ఆయన్ను కలిసి ఎపి రాష్ట్ర  ఎస్ ఆర్సీ లాబొరేటరీ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, టి సతీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా కోవిద్ సమయంలో తమ ఎస్ ఆర్సీ లాబొరేటరీ ప్రైవేటు లిమిటెడ్, వెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు మరియు కర్ణాటక రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యగా సుమారు కోటి రూపాయలు విలువ జేసే హ్యాండ్ శానిటీజర్,మాస్కులను ప్రజలకు ఉచితంగా  పంపిణీ చేయడంతో పాటు విద్యా,వైద్యా మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు వివరించగా అందుకు స్పందించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప డాక్టర్ ఏలూరి సేవలను కొనియాడారు. ఇలాగే కష్ట పడుతూ మరోవైపు సమాజ అభివృద్ధిలో ముందుకు నడవాలని సూచించారు. ఉన్నత ఆశయంతో,ఉత్తమ ప్రమాణాలతో శరవేగంగా నడుస్తున్న ఎస్ ఆర్సీ లాబొరేటరీ ప్రైవేటు లిమిటెడ్,వెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ కు మంచి భవిష్యత్తు వుందని, అలాగే ప్రభుత్వ సహకారం ఎప్పుడు వుంటుందని ముఖ్యమంత్రి యడ్యూరప్ప డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డికి భరోసా ఇచ్చారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

గ్రామ పంచాయతీ ఎన్నికలలో 4 వార్డ్ లో..

గెలిచిన టైలర్ లకు సన్మానం

 వెంకటేశ్వర్ రెడ్డి కి సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ  గ్రామ పంచాయతీలో  టైలర్స్  నాలుగు వార్డులో  గెలుపొందిన  టైలర్ లు ఆదివారం ఉదయం 10 గంటల కి  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర పత్తికొండలో స్థానిక ఎలక్షన్లలో జరిగిన వార్డు నెంబర్ లు 4 వార్డులలో గెలుపొందిన టైలర్లు రాష్ట్ర టైలర్ అసోసియేషన్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి కి శాలువాతో సన్మానం చేసి పూలమాల వేశారు .పత్తికొండ లో ఉండే టైలర్ లందరూ పత్తికొండ టైలర్స్ వారికి సన్మానం చేశారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పత్తి కొండ పురవీధుల గుండా  అంబేద్కర్ సర్కిల్ వరకు టైలర్  లు ర్యాలీ నిర్వహించారు.  అనంతరం కర్నూల్ రోడ్డు గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బి ఎల్ ఫంక్షన్ హాల్ లో గెలిచిన  టైలర్ వార్డు మెంబర్లకు  సన్మానము  కార్యక్రమం  చేశారు. కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమం జరిగినది . ఈ కార్యక్రమానికి పత్తికొండ టైలర్ గౌరవ అధ్యక్షులు తిక్క స్వామి, గౌరవ సలహాదారుడు జిఎం. టైలర్, రవి రాజ్ టైలర్ రాము ప్రధాన కార్యదర్శి చుక్క ప్ప, లేడీస్ టైలర్ నాగరాజు ఇస్మాయిల్, రాజు, దస్తగిరి, కరీం, నబి , షాదీఖానా చైర్మన్ హనీఫ్ రసూల్, సుంకన్న ,రంగన్న , లాలు, మహమ్మద్, బిగ్ బాస్, నరసింహులు, గోపాల్,కాసిం , తదితరులు టైలర్ లు పాల్గొన్నారు.



  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ఠ  పురస్కారం 2021...

అందుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

విజయవాడ లోని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రం వెలిదండల హనుమంత రాయ గ్రంథాలయ ప్రాంగణం వేదికగా ఆదరణాలయం ఛారిటీస్&క్రియేటివిటీ. కల్చరల్ టాలెంట్&వేరియస్ సిల్క్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర ఆరవెల్లి అధ్యక్షతన జరిగిన వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట  స్థాయి 2021పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది జాతీయ స్థాయిలో  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభా వంతులకు ముఖ్య అతిథులు  .శ్రీ శ్రీ అకాడమీ జాతీయ చైర్మన్ కత్తి మండ ప్రతాప్.ఫిలిం ఛాంబర్స్ కాంబర్స్అధ్యక్షులు కార్తీక్ రెడ్డి.ప్రొఫెసర్ పబ్బిశెట్టి.సీనియర్ పాత్రికేయులు ఎడవల్లి శ్రీనివాస్ రావు. టీ.టీ.డీ.బోర్డు సభ్యులు అనిల్.పురస్కారం అందజేశారు కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్  . వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ఠ -2021పురస్కారం అందుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ  శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా  జాతీయ స్థాయిలో  ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.

 


ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.2021రాష్ట్ర స్థాయి మదర్ థెరిస్సా పురస్కారం దాదాపు వందకు పైగా పురస్కారాలు సామాజిక సేవలకు గాను అందుకున్నానని ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సినిమా  ఆర్టిస్టులు .కళాకారులు. టీవీ ఆర్టిస్టులు.కవులు రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 ఓయూ క్యాంపస్ లో నిరసన దీక్ష

"" చలో హైదరాబాద్ "" నీ విజయవంతం చేయాలి

రక్షణ చట్టం తీసుకురావాలని  డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

పోరుగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం న్యాయ వాదులు, విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన రావు, నాగమణి దంపతుల హత్యను ఖండిస్తూ ఓయూ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులు, న్యాయవాదుల పోరాటం మరవలేనిది. తెలంగాణ సాధనలో గణనీయమైన కృషి చేసిన న్యాయ వాదులకు నేడు రక్షణ కరువైంది. మహిళా న్యాయ వాది నీ కూడా అతి దారుణంగా దాడి చేసి హత్య చేయడం పట్ల పలు మహిళా సంఘాలు, న్యాయ వాదులు తీవ్రంగా ఖండించడం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం నోరువిప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు బి.కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అన్నారు. అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేసి కేసును విచారించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద దంపతులను హత్య చేయడానికి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రభుత్వం, పోలీసులు కలిసారంటే  న్యాయవాదుల బలం ఎంత గట్టిదో గమనించాలని తెలిపారు. ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వారిపై దాడి చేసి హత్య చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్నికోర్టుల ముందు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9 వ తేదీన "" చలో హైదరాబాద్ """ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. న్యాయవాద విద్యార్థులు, న్యాయ వాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. ఓయు న్యాయ విభాగం విద్యార్థులు, కృష్ణ యాదవ్, గిరీష్, హంసు వర్మ, యాదయ్య, మల్లేష్ యాదవ్, యాదయ్య, న్యాయవాదులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

 "" న్యాయ సంస్కృతి ""పుస్తకావిష్కరణ

నిజాం పీజీ విద్యార్థులకు స్వాగత సమావేశం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా ప్రభావం వల్ల అడ్మిషన్లకు ఆలస్యం జరగటంతో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం ప్రారంభం శనివారం సమావేశంతో షురూ అయింది. దీంతో విద్యార్థులు ఆనందంగా, ఉల్లాసంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా """ న్యాయ సంస్కృతి "" అనే పుస్తకాన్ని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహా రెడ్డి, సభ్యులు బి.కొండారెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.అపర్ణ అథితులను శాలువాతో సత్కరించారు.

ఈ సమావేశం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం బార్ కౌన్సిల్ సభ్యులు బి.కొండారెడ్డి మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులుగా సమాజాన్ని మార్చేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా కృషి చేయాలని కోరారు. వృత్తి ధర్మాన్ని కాపాడే బాధ్యత మీదేనని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సామాన్యుడికి ,నిరుపేదలకు చట్టాలు చేరువయ్యేలా నడిపించాలని అన్నారు. ఈ సమావేశానికి బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహా రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.



 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది... హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  

గ్రాండ్ గా మొదలైన..డార్క్ థ్రిల్లర్  'జి.టి.ఎ' 

(గన్స్-ట్రాన్స్-యాక్షన్)

(జానోజాగో వెబ్ న్యూస్-సినీ బ్యూరో)

     అశ్వద్ధామ ప్రొడక్షన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి 'బైరి దీపక్ సిద్ధాంత్'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ బి.సుశీల నిర్మిస్తున్న డార్క్ థ్రిల్లర్  'జి.టి.ఎ'  (గన్స్-ట్రాన్స్-యాక్షన్).

చైతన్యకృష్ణ, హీనా రాయ్, సుదర్శన్, శరత్ చంద్ర, రాఖీ, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి కుమనన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 28 ఫిబ్రవరి ఉదయం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది.

చైతన్యకృష్ణ-సుదర్శన్-రాకీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా.. బజార్ రౌడీ నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. 

     అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత డాక్టర్ సుశీల దర్శకుడు బైరి దీపక్ సిద్ధాంత్, చైతన్యకృష్ణ, సుదర్శన్, రాకీ, శరత్ చంద్ర, కుమనన్, హీరోయిన్ హీనా రాయ్, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, కెమెరామెన్ కె.వి.ప్రసాద్, ఎడిటర్ గ్యారీ, ప్రముఖ విద్యావేత్త పి బి.వి.సుబ్బయ్య పాల్గొన్నారు. 

టాలీవుడ్ లో ఇప్పటివరకు తెరకెక్కని అత్యంత వైవిధ్యమైన కథాoశంతో డార్క్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అందుకు అవసరమైన అద్భుతమైన టీమ్ సెట్ అయ్యిందని దర్శకనిర్మాతలు తెలిపారు!!






 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 


 మా అభ్యర్థిని గెలిపించండి

ఒంగోలులో బీజేపీ నేతల ప్రచారం

(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

ఒంగోలు కార్పొరేషన్ కు మార్చి10వ తేదీ న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 8 వ డివిజన్ కు బీజేపీ,జనసేన పార్టీలు బలపర్చిన బీజేపీ అభ్యర్థి ముదువర్తి బాబు రావు ను గెలిపించాలని ఆదివారంనాడు కమ్మపాలెం ఏరియాలో బీజేపీ నేతలు ప్రచారం చేపట్టారు. కమ్మపాలెం ఏరియాలో ఉన్న శ్రీ.వేంకటేశ్వరస్వామి అలయములో పూజా చేసి ఎన్నికలు ప్రచారము ప్రారంభించారు. ఇంటిఇంటికీ వెళ్లి తమ ఓటు బీజేపీ గుర్తు కమలానికి ఓటు వేసి ముదువర్తి బాబు రావును గెలిపించాలని కోరారు. ఈ ప్రచారకార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పివి.కృష్ణరెడ్డి ముఖ్యఅతిథిలుగా పాల్గొని ప్రచారము చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కాట్రగడ్డ వాసు,బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తానికొండ సురేష్ యాదవు,రాష్ట్ర నాయకులు బంగారుబాబు,బీజేపీ నాయకులు డి.రాము,రాధ కృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.









,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

 ఎం.పి జోగినపల్లి సంతోష్ స్పూర్తితో...

నేను సైతం కేసీఆర్ కోసం..

'కోటి వృక్షార్చన' క్రతువులో అంటున్న విజయ్ భాస్కర్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

"బతుకమ్మ, సిక్సటీన్స్, మనసుతో" చిత్రాల కథానాయకుడు విజయ్ భాస్కర్ మేడ్చల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు... కేసీఆర్ కోసం కోటి వృక్షార్చనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయ్ భాస్కర్ తెలిపారు. విజయ్ భాస్కర్ తోపాటు... ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నవీన్, నిర్మాత రాజేష్ నాగుల పాల్గొన్నారు!!

 



 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

ఎకనామిక్ టైమ్స్ అవార్డు అందుకున్న...

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

 ప్రతిష్టాత్మక ది టైమ్స్ గ్రూప్ తరుపున ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుండి ఎస్ ఆర్సీ లాబొరేటరీ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అవార్డు  అందుకున్నారు. దక్షిణ భారతదేశంలో వివిధ రంగాలలో అగ్ర భాగాన నిలచిన ది టైమ్స్ గ్రూప్ తరుపున ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆధ్వర్యంలో ' 40 అండర్  40 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి బెంగుళూరులో ఘనంగా జరిగింది. ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ గ్రూప్ సౌత్ ఇండియా ఇంచార్జ్ మమతా నల్లా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రఖ్యాత బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్ చేతుల మీదుగా హర్షధ్వానాల మధ్య డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్భంగా నల్లా రెడ్డి ప్రసంగిస్తూ మా సంస్థ నిర్వహించిన సర్వేలో డాక్టర్ ఏలూరి లాంటి యువ పారిశ్రామిక వేత్త ఈ అవార్డు కు ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. ఫార్మా కంపెనీ రంగంలో అగ్ర శ్రేణీలో వుండడమేగాక సామాజిక దృక్పథంతో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నల్లా రెడ్డి అన్నారు. అవార్డు అందుకున్న అనంతరం డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో నే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ గ్రూప్ నిర్వహించిన జాబితాలో మా పేరు వుండడమే గాక అవార్డు కు ఎంపిక కావడం, అవార్డు అందుకోవడం మర్చిపోలేని  అనుభూతనిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
తమ ఫార్మా కంపెనీ ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి జీవనోపాధి కల్పించామని అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. ఈ అవార్డు అందుకోవడం ద్వారా సమాజంలో మా మీద అలాగే ఎస్ ఆర్సీ లాబొరేటరీకి మరింత బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నామని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

 ఘనంగా జంబూలాపరమేశ్వరి అమ్మవారి తిరుణాల

పోటెత్తిన భక్తులు..కన్నులపండుగగా శోభాయాత్ర

రేపు గాడిదలు పందాలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జంబూలాపరమేశ్వరి అమ్మవారి  ఆలయంలో తిరుణాల ఘనంగా జరిగింది. మాఘమాసం పౌర్ణమి రోజైన శనివారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించారు. తెలుగుపేట నుండి ప్రారంభమైన అమ్మవారి శోభా యాత్ర ప్రారంభమై పెద్దబండ, రజకపేట, బైటిపేట మీదుగా ఆలయాన్ని చేరింది, వందలాది మంది మహిళలు సంప్రదాయ బద్దంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. నిర్వాహకులు ఈ ఏడాది చెక్కభజనను ఏర్పాటు చేయ్యడంతో శోభాయాత్రకు మరింత శోభ చేకూరింది.

జంబూలా పరమేశ్వరి అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. బోనాలు సమర్పించడానికి భక్తులు వేల సంఖ్యలో రావడంతో అలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. కర్నూలు, నంద్యాల మాజీ ఎంఎల్ఏలు ఎస్.వీ. మోహన్ రెడ్డి,  భూమా బ్రహ్మానంద రెడ్డి, పాలడైరీ ఛైర్మెన్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గాడిదల పోటీ : 

తిరుణాల సందర్భంగా శనివారం ఆలయంలో గాడిదల పోటీని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గాండ్ల జగన్,  ఆర్గనైజర్లు పరమేశ్వర రెడ్డి, జిలెల్ల శ్రీరాములు, నాగరాజు,  హనుమాన్ శ్రీను పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  

పురపాలక ఎన్నికల్లో...

వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి

నంద్యాల వైద్యులు

సంఘీభావం తెలుపుతున్న వైద్యులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

త్వరలో జరగనున్న పురపాలక సంస్థల ఎన్నికలలో నంద్యాల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించవలసినదిగా వైఎస్సార్సీపీ నంద్యాల వైద్యుల విభాగం విజ్ఞప్తి చేసింది. శనివారం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో వైయస్సార్సిపి నాయకులు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వైద్యులు మధుసూదనరావు, రాకేష్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వినోద్, భార్గవ్ వర్ధన్ రెడ్డి, అనిల్, బెక్కెం సుబ్బారెడ్డి,  నిరంజన్ రెడ్డి, నెట్ల మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...
వైయస్సార్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చూసి స్థానిక సంస్థల అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ముఖ్యంగా వైయస్సార్ ఆరోగ్యశ్రీ  పథకంలో గతంలో లేనివిధంగా అనేక రకాల జబ్బులను చేర్చడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చికిత్స పూర్తి అయిన తర్వాత విశ్రాంతి సమయంలో కూడా అవసరమైన ఆర్థిక సహకారం అందించడం రోగులకు కోలుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా అనేక  నూతన వైద్య కళాశాలల ప్రారంభం ప్రజలకు వైద్యపరంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే  శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి నంద్యాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. మార్చి పదవ తారీఖున జరిగే పురపాలక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి పట్టణ అభివృద్ధికి మద్దతు తెలుపవలసినదిగా అన్ని వర్గాల ప్రజలకు వైద్యులు విజ్ఞప్తి చేశారు.

 శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..

టిడిపి నాయకులు బోయ చిన్న బొజ్జన్న దంపతులు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

 మండలం పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో శనివారము స్థానిక టిడిపి నాయకులు బోయ చిన్న బొజ్జన్న దంపతులు గ్రామంలో ఉన్న శివ స్వాముల అందరికీ తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ స్వాముల మూలా దారుల స్వాములకు ప్రత్యేక పూజా కార్యక్రమం  నిర్వహించిన అనంతరం అన్నదానం చేపట్టారు.  ఈ సందర్భంగా ముక్కెళ్ల సీనియర్ టిడిపి నాయకులు బొజ్జన్న  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ గుణం కలిగి ఉండాలని ఆయన  కోరారు. సేవ చేసె గుణం ఉంటే భగవంతుడు సంతానం తో పాటు మంచి కార్యక్రమం చెప్పడతాడని ఆయన తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరు భక్తి తో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో  శివ స్వాములు, కుటింబ సభ్యులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

గెలివి, నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై..

చర్యలు తీసుకోవాలి..తనిఖీలు నిర్వహించాలి

డిఇఓకు ఏఐఎస్ఎఫ్ నేతల వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తూ విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని నంద్యాలకు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ)సాయిరాంను కలిసి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఏఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్ వినతి పత్రం అందజేశారు. స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ,ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ చేస్తున్నారని కావున ఆ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాలకు విచ్చేసిన డిఇఓ సాయిరాంను కలిసి పిర్యాదు చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు ఏఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలివి స్కూల్ యాజమాన్యం చేస్తున్న ఫీజుల దోపిడిపై,మౌలిక సదుపాయాలలో భాగంగా విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం ఆటస్థలం లేదని,పార్కింగ్ స్థలం లేదని,విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్ కూడా సక్రమంగా లేవని,మరియు గెలివి స్కూల్ రోడ్ పక్కనే ఉన్న కారణంగా ఉదయం విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో,తిరిగి స్కూల్ వదిలే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నదని ఇలా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నదని కావున గెలివి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నంద్యాల ఉపవిద్యాశాఖ అధికారి గారికి ఎన్నో సార్లు పిర్యాదు చేసిన కూడా లాభం లేకుండా పోయిందని వారు తెలిపారు.అంతే కాకుండా అదే ఏరియాలో ఉన్న నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కూడా 3 అంతస్తుల్లో పాఠశాల నిర్వహిస్తూ పాటించవలసిన ఫైర్ నిబంధనలు పాటించకుండా ఎదో పెట్టాలంటే పెట్టాలి అన్నట్టుగా ఫైర్ పరికరాలు పెట్టారని,అంతే కాకుండా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఎటువంటి ఆటస్థలం కానీ,పార్కింగ్ స్థలం కానీ,సరిపడు టాయిలెట్స్ కానీ లేవని వారు తెలిపారు.మరి ముఖ్యంగా కరోన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు కూడా తగ్గించాలని సూచించిన కూడా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మొత్తం ఫీజులు కట్టాలని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు విన్నవించినా కూడా ఉపవిద్యాశాఖ అధికారి (డిప్యూటీ డీఇఓ) ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమని,ఆ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మాచెప్పులు అరిగిపోయ్యాయి తప్ప ఇంతవరకు ఆ స్కూళ్ల వైపు నంద్యాల డిప్యూటీ.డి.ఈ.ఓ గారు ఒక్కసారి కూడా తొంగి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిఇఓ సాయిరాం గారికి వివరించారు.కావున తక్షణమే గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ స్కూళ్లను డిఇఓ సాయిరాం గారు తనిఖీ చేసి చర్యలు తీసుకొని,ఫీజుల వివరాలను ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని,ఆ రెండు పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దందాకు అడ్డుకట్ట వేయాలని డిఇఓ సాయిరాంను ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఆ స్కూళ్లపై చర్యలు తీసుకునేంత వరకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని వారు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి