అక్కడ మూడు...పట్టణంలో రెండు సెంట్లు ఇవ్వాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున పంపిణీ చేసే ఇళ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య, చేతి వృత్తిదారుల సంఘం, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ,బి సి ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సమైక్య, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లో ఏ.ఓ హరినాథ్ రావుకు వినతి పత్రం అందచేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం నంద్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి & డి హెచ్ పి ఎస్ గౌరవ కన్వీనర్ ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమరు అధికారం చేపట్టి ప్రకటించిన నవరత్నాలు లో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ కి శ్రీకారం చుట్టారు ప్రారంభంలో 25 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఇప్పటికీ దాదాపు 31 లక్షలఇళ్ల స్థలాల సంఖ్య పెరగగా రకరకాల కారణాలతో వాయిదాల పడుతూ కోర్టు లిటిగేషన్ లేని భూముల్లో చివరికి డిసెంబర్ 25న పంపిణీ చేస్తామని ప్రకటించారు దీనికి స్వాగతిస్తున్నాయి, అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లస్థలాల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నదని అందుకు నిదర్శనం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1:50 సెంట్ స్థలం,పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలాలు ఇవ్వడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అంతే కాకుండా గత ప్రభుత్వంలో నిధులు విడుదల అయ్యాయనే నెపంతో టిడ్కో గృహలను పూర్తి చేయకుండా,ఒకవేళ పూర్తి అయిన చోట ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా,కొన్ని చోట్లా పూర్తి అయిన ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు వెంటనే ఆపివేసి,కోర్టులో పెండింగ్ లేకుండా పూర్తి అయిన అన్ని ప్రాంతాల్లో సింగల్ బెడ్ రూమ్ ఉన్న ఇళ్లను,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుగా మార్చి వెంటనే పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు,పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,కావున రాష్ట్ర ప్రభుత్వం అవైపున ఆలోచన చేసి వెంటనే పై డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఎపి చేతివృత్తి దారుల సంఘాల సమాఖ్య,ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం,ఏపీ గిరిజన సమాఖ్య,దళిత హక్కుల పోరాట సమితి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని. వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఎఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్,బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ, జీవిఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: